Udaipur: మణప్పురం ఫైనాన్స్లో దోపిడీ.. తుపాకీ గురిపెట్టి రూ.12 కోట్ల నగలు ఎత్తుకెళ్లిన ముసుగు దొంగలు
మణప్పురం ఫైనాన్స్లో భారీ దోపిడీ జరిగింది. సినిమాలోని సన్నివేశాల్ని తలదన్నేలా.. ముసుగులు ధరించిన ఐదుగురు దుండగులు సిబ్బందిని తుపాకీతో బెదిరించారు. ఆఫీస్లో ఉన్న రూ.12 కోట్ల విలువైన నగల్ని ఎత్తుకెళ్లారు.
Udaipur: రాజస్థాన్లోని ఉదయ్పూర్లో భారీ దోపిడీ జరిగింది. మణప్పురం ఫైనాన్స్లో సిబ్బందికి తుపాకీ గురిపెట్టి, రూ.12 కోట్ల విలువైన నగల్ని దుండగులు దోచుకెళ్లారు. నిందితులంతా ముసుగులు ధరించి ఉన్నారు. ఈ ఘటన ఉదయ్పూర్లోని ప్రతాప్ నగర్లో సోమవారం జరిగింది.
Viral video: పెరట్లో మంచంపై పడుకున్న మహిళ.. ఆమె మీదికెక్కిన నాగుపాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో పిస్టల్స్ కలిగిన ఐదుగురు వ్యక్తులు మణప్పురం ఫైనాన్స్ కార్యాలయంలోకి చొరబడ్డారు. వాళ్లు ముసుగులతోపాటు, హెల్మెట్ కూడా ధరించి ఉన్నారు. ఆఫీస్లోకి చొరబడ్డ వెంటనే తుపాకులతో స్టాఫ్ను బెదిరించి, అందరినీ గోడకు ఒక పక్కన నిలబెట్టారు. వాళ్లందరి చేతులూ కట్టేశారు. తర్వాత వారిని బెదిరించి, ఇద్దరు ఉద్యోగుల దగ్గరున్న ‘కీ’లతో లాకర్స్ తెరిపించారు. తర్వాత వాళ్ల చేతులు కూడా కట్టేశారు. తర్వాత లాకర్లలో ఉన్న నగలు, క్యాష్ను తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో నింపుకున్నారు. అనంతరం అక్కడ్నుంచి బైకులపై వెళ్లిపోయారు. అప్పటికి ఉద్యోగులు కట్టేసే ఉన్నారు. అయితే, ఒక ఉద్యోగి చేతులు సరిగ్గా కట్టేయకపోవడంతో, అతడు తాడు విడదీసుకున్నాడు. తర్వాత మిగతా సిబ్బంది కట్లను విప్పేశారు. అనంతరం ఉన్నతాధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Tamil Nadu: బస్సు ఫుట్బోర్డ్పై నుంచి పడి తొమ్మిదో తరగతి బాలుడు మృతి
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం మొత్తం 20 కేజీలకు పైగా నగలు, రూ.10 లక్షలకుపైగా క్యాష్ను దోపిడీ దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మణప్పురం ఫైనాన్స్ కార్యాలయం వద్ద ఎలాంటి సెక్యూరిటీ లేదు. కాగా, ఈ కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి, నిందితుల్ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.