Hathras ఘటన వెనువెంటనే మరో దారుణం: మైనర్ బాలికపై పొలాల్లో..

Hathras ఘటన వెనువెంటనే మరో దారుణం: మైనర్ బాలికపై పొలాల్లో..

Hathras రేప్ బాధితురాలు చనిపోయిన మరుసటి రోజే మరో దారుణం జరిగింది. మైనర్ బాలికను ఇంట్లో నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన ముగ్గురు వ్యక్తులు పొలాల మధ్య Gang-Rape చేశారు. మధ్యప్రదేశ్ లోని ఖార్గోన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

ముగ్గురు వ్యక్తులు మంగళవారం సాయంత్రం సమయంలో ఇంటికొచ్చి మంచినీళ్లు కావాలంటూ అడిగారు. అక్కడ వాదన జరిగింది. అప్పుడే బాలిక సోదరుడ్ని తోసేసి ఆమెను తీసుకుని వెళ్లిపోయారు. సాయం చేయమని పొరుగిళ్లకు తిరుగుతూ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలోపే వారు దూరంగా వెళ్లిపోయారు.



పొలాల్లో గ్యాంగ్ రేప్ చేసి బాధితురాలిని అక్కడే వదిలేసిపోయారు. పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి విచారణ జరిపారు. నిందితులను అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

సెప్టెంబర్ 14న హత్రాస్ కు చెందిన దళిత యువతిపై ఓ వర్గానికి చెందిన నలుగురు దుండగులు అత్యాచారం చేసి అత్యంత అమానవీయంగా నాలుక కోశారు. ఈ ఘటనలో ఆమె తలకు, నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. రెండు వారాల పాటు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ.. మంగళవారం ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో చనిపోయింది.