Minor Girls Molested : కబడ్డీ నేర్పిస్తామని చెప్పి మైనర్ బాలికలపై తండ్రీ, కొడుకుల లైంగిక వేధింపులు

విశాఖ జిల్లాలో 9 ఏళ్ల బాలికలకు  కబడ్డీ నేర్పిస్తానని,  తినుబండారాలు ఆశ చూపి తండ్రీ కొడుకులిద్దరూ లైంగిక వేధింపులకు  పాల్పడిన సంఘటన వెలుగు చూసింది.

Minor Girls Molested : కబడ్డీ నేర్పిస్తామని చెప్పి మైనర్ బాలికలపై తండ్రీ, కొడుకుల లైంగిక వేధింపులు

Minor Girls Molested

Minor Girls Molested : ఆడపిల్ల కనిపిస్తే చాలు మంచంలో ఉన్న ముసలోడు కూడా ఆపిల్లను పాడుచేయాలని చూసే పాడు సమాజంలో మనం బతుకుతునన్నామా అని భయం వేస్తుంటుంది ఒకోసారి కొన్ని సంఘటనలు చూస్తుంటే. విశాఖ జిల్లాలో 9 ఏళ్ల బాలికలకు  కబడ్డీ నేర్పిస్తానని,  తినుబండారాలు ఆశ చూపి తండ్రీ కొడుకులిద్దరూ లైంగిక వేధింపులకు  పాల్పడిన సంఘటన వెలుగు చూసింది.

విశాఖజిల్లా, అచ్యుతాపురం మండలం పూడి మడక పంచాయతీ శివారు కడపాలెం గ్రామానికి చెందిన మేరుగు బాపయ్య, నూకరాజు తండ్రి కొడుకులు. గ్రామానికి చెందిన నాలుగో తరగతి చదువుతున్న బాలికలకు (9) కబడ్డీ నేర్పిస్తానని నూకరాజు వారిని సమీపంలోని సరుగుడు తోటలోకి తీసుకువెళ్లి  వారిపై లైంగికదాడి చేసేవాడు. ఈక్రమంలో తండ్రి బాపయ్య కూడా వారికి తినుబండారాలు, డబ్బలు ఆశ చూపి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు.
Also Read : Maoist Leader Sharadakka : డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేత శారదక్క
దీంతో భయపడిన బాలికలు వారి తల్లితండ్రులకు  విషయం చెప్పారు. దీంతో వారు సోమవారం అచ్యుతాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అనకాపల్లి దిశ పోలీసు స్టేషన్‌ డీఎస్పీ మహేశ్వరరావు మంగళవారం కడపాలెం వచ్చి విచారణ చేపట్టారు.

బాధితురాళ్లను వైద్య పరీక్షల నిమిత్తం అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితులు బాపయ్య, నూకరాజు పరారీలో ఉన్నారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.