Love couple murder : ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. మైనర్ ప్రేమ జంటను హత్య చేసి చెట్టుకు వేలాడదీసి….

గత ఆరేళ్లుగా వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు. కులాలు వారి ప్రేమకు అడ్డంకిగా మారాయి. పెద్దలు ఒప్పుకోరని ఒకసారి పారిపోయిన ఆ జంట పోలీసుల వెతుకులాటలో ఇంటికి చేరింది. రెండోసారి మాత్రం ఎప్పటికి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో మైనర్ ప్రేమ జంట హత్య సంచలనం రేపుతోంది.

Love couple murder :  ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. మైనర్ ప్రేమ జంటను హత్య చేసి చెట్టుకు వేలాడదీసి….

Love couple murder

Love couple murder :  ఉత్తరప్రదేశ్‌లో అదృశ్యమైన మైనర్ ప్రేమజంట చెట్టుకు వేలాడుతూ కనిపించింది. కులాలు వేరు కావడంతో వారి ప్రేమను అంగీకరించని బాలిక కుటుంబసభ్యులే వారిని హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

 

ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. కనిపించకుండా పోయిన ప్రేమ జంట అసివాన్ పోలిస్ స్టేషన్ పరిథిలోని మామిడితోటలో చెట్టుకు వేలాడుతూ కనిపించడం సంచలనం రేపింది. బాలిక కుటుంబ సభ్యులే హత్య చేసి ఉరివేసుకున్నట్లు చిత్రిస్తున్నారని మృతుడి ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తున్నారు.

Telangana : మైనర్ ప్రేమికులు ఆత్మహత్య- ప్రేమజంట వీడియో వైరల్

అసివాన్‌కి చెందిన రాకేష్ సింగ్ కూతురు అదే గ్రామానికి చెందిన ఛోటే లాల్ పాశ్వాన్ కొడుకుకి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే వీరి కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి ప్రేమను అంగీకరించనట్లుగా తెలుస్తోంది. ఆ కారణంతోనే బాలిక కుటుంబ సభ్యులు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఇప్పటి వరకూ బాలిక కుటుంబంలోని నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

మరోవైపు బాలిక గొంతు నులిమినట్లు .. బాలుడి మెడ విరిగిపోవడంతో పాటు శరీరంపై అనేక గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. బాలిక కుటుంబసభ్యులు ఏడుగురు పరారీలో ఉండగా నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Living Together : ప్రేమ జంటకు రూ.25వేలు ఫైన్..కొద్ది రోజులు కలిసుంటే సహజీవనం అయిపోదన్న హైకోర్టు

మైనర్ ప్రేమ జంట 6 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారని మార్చి 7వ తేదీన ఇద్దరూ పారిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే బాలిక కుటుంబ సభ్యులు బాలుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. పోలీసులు వారిద్దరినీ వెతికి పట్టుకుని మార్చిలో బాలుడిని జువైనల్ హోంకు కూడా తరలించారు. తనను అబ్బాయి కిడ్నాప్ చేయలేదని బాలిక స్పష్టం చేయడంతో అతడిని ఇటీవలే విడుదల చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి హత్య సంచలనం రేపుతోంది. వీరి హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.