బీహార్ లో భారీ పేలుడు, తల్లి, ఆరునెలల కొడుకు మృతి

  • Published By: murthy ,Published On : May 30, 2020 / 10:45 AM IST
బీహార్ లో భారీ పేలుడు, తల్లి, ఆరునెలల కొడుకు మృతి

బీహార్ లోని ముంగర్ జిల్లాలో శనివారం పేలుడు సంభవించింది. బరియాపూర్ బజార్ లోని దష్రత్ షా అనే వ్యక్తి ఇంట్లో తెల్లవారుఝూమున 3 గంటల సమయంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆ ఇంట్లో నివసించే దష్రత్ షా  కుమార్తె రోమా కుమారి(30) తో పాటు, 6 నెలల వయస్సున్న ఆమె కొడుకు కూడా ప్రాణాలు విడిచాడు. పేలుడు ధాటికి పక్కనే ఉన్న మరో ఆరు ఇళ్లుకూడా  దెబ్బతిన్నాయి. 

పేలుడు సమయంలో దష్రత్ షా మేడ పై నిద్రిస్తుండగా అతని కుమార్తె రోమా కుమారి, మనవడు ఇంట్లో నిద్రిస్తున్నారు. దష్రత్ షా ఆ ఇంట్లో తినుబండారాల షాపు నిర్వహిస్తున్నాడు. కాగా…. త‌మ కుమార్తె  పెళ్ళి విష‌యంలో ఆమె అత్తింటి వారితో ప్రస్తుతం గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ‌ని మృతురాలు త‌ల్లి పోలీసులకు చెప్ప‌డంతో.. పోలీసులు ఆ కోణంలో కూడా ద‌ర్యాప్తు చేస్తున్నారు. రోమా కుమారి తమ ఇంటి సమీపంలోని వ్యక్తిని గతంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకు వారిద్దరి మధ్య మనస్ఫర్ధలు రావటంతో ప్రస్తుతం ఆమె తల్లి తండ్రులవద్దే ఉంటోంది. 

మ‌రోవైపు మృతురాలు కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆ ఏరియా ప్ర‌జ‌లు  భాగల్పూర్-ముంగేర్  రహదారిపై ఆందోళ‌న‌కు దిగ‌డంతో.. జిల్లా అధికారులు క‌లుగ‌జేసుకుని వారిని శాంతింప జేశారు.  ఘటనా స్ధలానికి చేరుకున్నన ముంగర్  జిల్లా ఎస్పీ ప్రమాదానికి గల కారణాలపై  డాగ్ స్క్వాడ్‌ను, క్లూస్ టీమ్‌ తో సంఘ‌ట‌నా స్థ‌లంలో ఆధారాల‌ను సేక‌రిస్తున్నారు.  
 

Read: కరోనా భయంతో దూరంగా గ్రామస్థులు…చిన్నారి అంత్యక్రియలు నిర్వహించిన అధికారి