చేతులు ఎలా వచ్చాయి తల్లి : ఆడ శిశువు నోట్లో జిల్లేడు పాలు పోసి చంపేశారు

  • Published By: madhu ,Published On : March 21, 2020 / 07:11 AM IST
చేతులు ఎలా వచ్చాయి తల్లి : ఆడ శిశువు నోట్లో జిల్లేడు పాలు పోసి చంపేశారు

తమకు ఆడబిడ్డ పుట్టిందని పురిట్లోనే కొంతమంది చంపేస్తున్నారు. ఆడబిడ్డ అంటే..భారంగా భావించి కనడానికి ఇష్టం చూపడం లేదు. కుదరకపోతే..పుట్టిన తర్వాత..చంపేస్తున్నారు. భేటీ బచావో..భేటీ పడావో అంటూ ఎంత ప్రచారం చేపడుతున్నా..ఎక్కడో ఒక దగ్గర భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆడ శిశువు నోట్లో జిల్లేడు పాలు పోసి మరీ చంపేశారు. ఈ హృదయవిదాకర ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

అండిపట్లి సమీపంలోని మెట్టనూత్తు పంచాయతీ రాహనాథపురానికి చెందిన సురేష్, కవిత (29) దంపతులు నివాసం ఉంటున్నారు. సురేష్ కేరళాలో ఉన్న కోలిక్కోడులో మేస్త్రీ పనిచేస్తున్నాడు. వీరికి పాండి మీనా (10), హరిణి (8) కుమార్తెలున్నారు. ఇటీవలే కవిత మూడోసారి గర్భం దాల్చింది. డెలివరీ కోసం 2020, ఫిబ్రవరి 20వ తేదీన క.విలక్కు ప్రభుత్వాసుపత్రిలో చేరింది.

అదే నెల 26వ తేదీన సాధారణ ప్రసవం ద్వారా ఆడబిడ్డ పుట్టింది. అనంతరం రెండు రోజుల అనంతరం వీరు ఇంటికి వచ్చారు. మార్చి 02వ తేదీన పుట్టిన బిడ్డ చనిపోయింది. ఇంటి సమీపంలో ఉన్న స్థలంలో మృతదేహాన్ని పాతిపెట్టారు. ఈ విషయం స్థానికులకు తెలిసింది. పాలు ఇచ్చిన సమయంలో విరోచనాలు ఏర్పడి చనిపోయిందని తల్లి వారికి చెప్పింది. 

స్థానికులకు ఎందుకో అనుమానం కలిగింది. జిల్లా శిశు సంక్షేమ రక్షణ కార్యాలయం, అండిపట్టి తహసీల్దార్ చంద్రశేఖర్‌కు సమాచారం అందించారు. 

వెంటనే అక్కడకు తహశీల్దార్ చంద్రశేఖర్, గ్రామ నిర్వాహఖ అధికారి దేవి, పోలీసులు చేరుకున్నారు. తల్లి కవిత, అత్త చెల్లమ్మాల్ విచారణ చేశారు. అయితే విషయాలు ఏమీ చెప్పలేదు. తమదైన శైలిలో విచారణ జరపగా 2020, మార్చి 19వ తేదీ గురువారం భ్రాంతిగొలిపే విషయాలు చెప్పారు. జిల్లేడి పాలు ఇచ్చి హత్య చేసినట్లు..కవితా..అత్త చెల్లమ్మాల్ ఒప్పుకున్నారు. బిడ్డ మృతదేహాన్ని బయటకు తీసి..అక్కడే ప్రభుత్వ డాక్టర్ సహాయంతో పోస్టుమార్టం నిర్వహించారు. అందులో జిల్లేడు పాలు పోసి హత్య చేసిన విషయం తేలింది. దీంతో వారిద్దరినీ అరెస్టు చేశారు. 

Read More : కోవిడ్ – 19 (కరోనా)..రాకూడదంటే ఇలా చేయొద్దు!