పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టిన తల్లి : అసలేం జరిగింది

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో విషాదం జరిగింది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ముందు కొడుకు, కూతురిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించింది. ఆ తర్వాత

  • Published By: veegamteam ,Published On : December 7, 2019 / 09:50 AM IST
పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టిన తల్లి : అసలేం జరిగింది

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో విషాదం జరిగింది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ముందు కొడుకు, కూతురిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించింది. ఆ తర్వాత

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో విషాదం జరిగింది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ముందు కొడుకు, కూతురిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించింది. ఆ తర్వాత తనూ కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. తీవ్ర గాయాలతో ముగ్గురూ మృతి చెందారు. మృతురాలి పేరు నిహారిక. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. కుటుంబకలహాలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. డిసెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిహారిక ఈ పని చేసింది.

నిహారిక భర్త మహేష్ ఓ మొబైల్ షాప్ లో పని చేస్తున్నాడు. 6 నెలలుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో డిసెంబర్ 6వ తేదీ రాత్రి భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. అత్త కూడా కోడలు నిహారికను తిట్టింది. తీవ్ర మనస్తాపం చెందిన నిహారిక పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు నిహారిక భర్త, తల్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర విషాదం నింపింది. పెద్దల మధ్య గొడవలకు పిల్లలు బలయ్యారని వాపోయారు. నిహారికకి ఇద్దరు పిల్లలు. మణిదీప్తి(2), బాబు కేదార్ నాత్ (ఏడాది వయసు). అభంశుభం తెలియని పిల్లలు. వారు ఏం తప్పు చేశారని స్థానికులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.