Mother kills Daughter: వేరే కులం వ్యక్తిని ప్రేమిస్తోందని కూతురును చంపిన తల్లి.. తర్వాత ఆత్మహత్యాయత్నం

తమిళనాడులో పరువు హత్య వెలుగు చూసింది. తన కూతురు వేరు కులానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తోందని ఆమెను హత్య చేసింది తల్లి. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది.

Mother kills Daughter: వేరే కులం వ్యక్తిని ప్రేమిస్తోందని కూతురును చంపిన తల్లి.. తర్వాత ఆత్మహత్యాయత్నం

Mother kills Daughter: తమిళనాడులో ఒక మహిళ దారుణానికి పాల్పడింది. వేరే కులం వ్యక్తిని ప్రేమిస్తోందని తన కూతురునే హత్య చేసింది తల్లి. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన తిరునల్వేలి పరిధిలో బుధవారం జరిగింది.

Elon Musk: రోజురోజుకూ తగ్గిపోతున్న ఎలన్ మస్క్ సంపద.. ట్విట్టరే కారణమా?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరుముగ కని, పిచయ్ దంపతులకు అరుణ అనే 19 ఏళ్ల కూతురు ఉంది. అరుణ ప్రస్తుతం వేరే ఊళ్లూ ఉంటూ నర్సింగ్ కోర్స్ చదువుతోంది. అయితే, అక్కడే వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తోంది. ఈ విషయాన్ని అరుణ ఇటీవల తన తల్లి అరుముగ కనికి చెప్పింది. ఈ విషయంపై మాట్లాడేందుకు అరుణను తల్లి ఇటీవల ఇంటికి పిలిపించింది. అరుణ ఇంటికి వచ్చిన తర్వాత తన తల్లి ప్రేమ పెళ్లి గురించి మాట్లాడేందుకు పిలవలేదని, తన కులంలోని వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేందుకు నిర్ణయించిందనే విషయం అర్థమైంది. దీనికి సంబంధించి బుధవారం పెళ్లి చూపులు కూడా ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలో తను చూపించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని తల్లి చెప్పింది. అయితే, అరుణ దీనికి నిరాకరించింది. తను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నవిషయాన్ని పెళ్లి చూపులకు వచ్చే వాళ్లకు చెబుతానని చెప్పింది.

Malla Reddy: బీజేపీ కుట్రలో భాగంగానే మాపై దాడులు.. ఐటీ అధికారులు నమ్మించి మోసం చేశారు: మంత్రి మల్లారెడ్డి

ఈ విషయంపై తల్లీ కూతుళ్ల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ క్రమంలో గొడవ పెద్దదైంది. దీంతో కోపం తెచ్చుకున్న తల్లి తన కూతురు గొంతు కోసి చంపింది. తర్వాత తను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. హెయిర్ డై తాగి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అరుణ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం తరలించారు.