అమానుషం.. తనకు నాగదోషం ఉందని పసికందు గొంతుకోసి చంపిన తల్లి

ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న ఈ రోజుల్లోనూ ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. అంధ విశ్వాసాలతో ఆటవికంగా వ్యవహరిస్తున్నారు. దోషాల పేరుతో ప్రాణాలు తీసేస్తున్నారు. ఓ కన్నతల్లి దారుణానికి ఒడిగట్టింది. నెలల పసికందుని కిరాతకంగా చంపేసింది. తనకు నాగదోషం ఉందని ఆమె ఈ ఘోరానికి పాల్పడింది.

అమానుషం.. తనకు నాగదోషం ఉందని పసికందు గొంతుకోసి చంపిన తల్లి

Mother Kills Daughter

Mother Kills Daughter : ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న ఈ రోజుల్లోనూ ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. అంధ విశ్వాసాలతో ఆటవికంగా వ్యవహరిస్తున్నారు. దోషాల పేరుతో ప్రాణాలు తీసేస్తున్నారు. ఓ కన్నతల్లి దారుణానికి ఒడిగట్టింది. నెలల పసికందుని కిరాతకంగా చంపేసింది. తనకు నాగదోషం ఉందని ఆమె ఈ ఘోరానికి పాల్పడింది.

సూర్యాపేట జిల్లా మోతె మండలం మేకలపాటి తండాలో ఈ దారుణం జరిగింది. తనకు నాగదోషం ఉందని ఓ తల్లి తన ఆరునెలల పసికందును కత్తితో గొంతు కోసి హతమార్చింది. గ్రామానికి చెందిన బానోత్‌ భారతికి అదే తండాకు చెందిన కృష్ణతో రెండున్నర ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆరు నెలల ఈషా అనే చిన్నారి ఉంది. కొన్ని నెలల కిందట గ్రామానికి వచ్చిన ఓ వ్యక్తి.. భారతికి నాగదోషం ఉందని చెప్పడంతో ఆమె పూజలు చేయడం ప్రారంభించింది.

అలా నిత్యం పూజలు చేస్తూ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. ఈ క్రమంలోనే గురువారం(ఏప్రిల్ 15,2021) సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారి ఈషాను చూసి నాగుపాముగా భావించింది. అంతలోనే దేవుడి చిత్రపటాల ముందు చిన్నారిని ఉంచి పూజలు చేసి కత్తితో గొంతు కోసి బలితీసుకుంది. అనంతరం బయటికి వచ్చి తన బిడ్డను హతమార్చినట్లు స్థానికులకు తెలిపింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే.. ఇలా.. నాగదోషం పేరుతో మూర్ఖంగా ప్రవర్తించడం షాక్ కి గురి చేసింది. ఆమె చేసిన పిచ్చి పనిని అంతా తప్పుపడుతున్నారు. తల్లి అంధ విశ్వాసాలకు అభంశుభం తెలీని చిన్నారి బలైందని స్థానికులు కన్నీటిపర్యంతం అయ్యారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని, నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించాలని కోరుతున్నారు.