Valentine’s Day: వాలెంటైన్స్ డే జరుపుకొనేందుకు గోవా వెళ్లిన జంట.. నీళ్లలో మునిగి ప్రేమికులు మృతి

ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. దీనికోసం సోమవారం ఇద్దరూ గోవా చేరుకున్నారు. దక్షిణ గోవా జిల్లా, క్యానకోనా తాలూకాలోని ఒక హోటల్‌లో బస చేశారు. సెలబ్రేషన్స్‌లో భాగంగా అక్కడి పాలోలెమ్ బీచ్‌కు వెళ్లారు.

Valentine’s Day: ప్రేమికుల రోజు నాడే ప్రేమ జంట ప్రమాదవశాత్తు మరణించిన విషాద ఘటన గోవాలో జరిగింది. ముంబైలోని ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న విభు శర్మ (27), బెంగళూరులోని సంస్థలో పని చేస్తున్న సుప్రియా దూబే (26) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

Madhya Pradesh: శాలరీ గురించి అడిగితే ఎముకలు విరిచేస్తా.. ప్రశ్నించిన పౌరుడిపై మంత్రి ఆగ్రహం.. వీడియో వైరల్

అయితే, ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. దీనికోసం సోమవారం ఇద్దరూ గోవా చేరుకున్నారు. దక్షిణ గోవా జిల్లా, క్యానకోనా తాలూకాలోని ఒక హోటల్‌లో బస చేశారు. సెలబ్రేషన్స్‌లో భాగంగా అక్కడి పాలోలెమ్ బీచ్‌కు వెళ్లారు. అనంతరం సోమవారం రాత్రి డిన్నర్ చేశారు. తర్వాత సరదాగా అక్కడి నీళ్లలో ఈత కొట్టేందుకు దిగారు. కానీ, ఇద్దరూ నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Maharashtra: సహజీవనం చేస్తున్న ప్రేయసిని చంపిన ప్రియుడు.. మృతదేహాన్ని బెడ్ కింద దాచి పరార్

హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. మంగళవారం ఉదయం ఇద్దరి మృతదేహాల్ని సముద్రపు నీటిలోంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే, వీరి మృతికి మరేమైనా కారణాలున్నాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇద్దరి మృతితో ఇరువురి కుటుంబాల్లో విషాదం నెలకొంది.

 

ట్రెండింగ్ వార్తలు