Mumbai Nirbhaya : చికిత్స పొందుతూ మహిళ మృతి..మానవత్వానికే మాయని మచ్చ

దేశ రాజధానిలో 9 ఏళ్ల క్రితం జరిగిన ‘నిర్భయ’’ ఘటన మరోసారి సారి చోటు చేసుకుంది. మానవ మృగం..ఓ మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు.

Mumbai Nirbhaya : చికిత్స పొందుతూ మహిళ మృతి..మానవత్వానికే మాయని మచ్చ

Mumbai

Mumbai Nirbhaya : దేశ రాజధానిలో 9 ఏళ్ల క్రితం జరిగిన ‘నిర్భయ’’ ఘటన మరోసారి సారి చోటు చేసుకుంది. మానవ మృగం..ఓ మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. అత్యాచారం చేసిన అనంతరం అత్యంత పాశవికంగా..ప్రవర్తించాడు. దారుణంగా హింసించాడు. కత్తితో పొడిచాడు. మర్మయవాల్లోకి ఇనుప రాడ్ దూర్చి రాక్షసంగా ప్రవర్తించాడు. చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ మహిళ కన్నుమూసింది. ఈ ఘటనపై ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఆ రాక్షసుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Read More : Mumbai Nirbhaya : అత్యాచారం చేసి రాడ్ చొప్పించి.. ముంబైలో నిర్భయ తరహా దారుణం

మహిళపై అత్యాచారం చేసి దారుణంగా హింసించి చంపడం మానవత్వానికే మాయని మచ్చ అన్నారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే. ఈ ఘటనపై వేగంగా దర్యాప్తు జరిపి..బాధితురాలి కుటుంబానికి న్యాయం చేస్తానని హామీనిచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయడానికి…ముంబై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని మోహన్ చౌహాన్ (45) గా గుర్తించారు పోలీసులు. ఘటన జరిగిన కొద్దిసేపటికే అతడిని అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి…నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు.

Read More : నిర్భయ తల్లి నిర్ణయం: నాబిడ్డకు న్యాయం జరిగింది..ఇక అత్యాచార బాధితుల కోసం పోరాడతా

నగర శివారు సాకినాక ప్రాంతంలోని ఖైరానీ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున టెంపో వాహనంలో మహిళపై దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తన కుమార్తె…పట్టుబడిన నిందితుడితో 10 నుంచి 12 ఏళ్లుగా కలిసి ఉంటోందని తల్లి వెల్లడిస్తోంది. ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవని, గొడవ పడడంతో తీవ్రంగా కొట్టి ఉండవచ్చునని తల్లి తమ దృష్టికి తీసుకొచ్చిందని ముంబై మేయర్ కిశోరి ఫడ్నేకర్ తెలిపారు. ఇక ఈ హత్యాచారం ఘటనపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, నిందితుడితో పాటు మరికొంతమంది పాల్గొనే అవకాశం ఉందన్నారు.

Read More : చట్టాలన్ని చుట్టేశాడు.. ఆఖరి నిమిషం వరకు.. నిర్భయ రేపిస్ట్‌ల లాయర్ ఓడిపోయాడు

బాధిత మహిళకు వివాహమై…13, 16 ఏళ్లున్న ఇద్దరు కుమార్తెలున్నారు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ జాన్ పూర్ కు చెందిన నిందితుడు మోహన్ ముంబైలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సాకినాక ఫుట్ పాతలపై రాత్రి వేళ నిద్రించేవాడు. మాదక ద్రవ్యాలకు బానిసైనట్లు పోలీసులు గుర్తించారు. అత్యాచారం చేసిన సమయంలో అతడు మత్తులో ఉన్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. ఇతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టగా..ఈనెల 21 దాక రిమాండ్ విధించింది.