Mumbai Police : హత్యకేసులో నిందితుడిని జైల్లోనే పెట్టుకుని 20 ఏళ్లు గాలించిన పోలీసులు .. కేసు కొట్టివేసిన న్యాయమూర్తి

 ‘ఉయ్యాలలో బిడ్డను పెట్టుకుని ఊరంతా తిరిగినట్లు’ ఓహత్య కేసులో ముంబై పోలీసులు జైలులోనే నిందితుడిని పెట్టుకుని దేశమంతా ఏడాది కాదు రెండేళ్ల కాదు ఏకంగా 20 ఏళ్లు గాలించిన వైనం వెలుగులోకి వచ్చింది.

Mumbai Police : హత్యకేసులో నిందితుడిని జైల్లోనే పెట్టుకుని 20 ఏళ్లు గాలించిన పోలీసులు .. కేసు కొట్టివేసిన న్యాయమూర్తి

Mumbai Police hunted for Chotta Shakeel sharpshooter everywhere for 20 years

Mumbai Police : ‘ఉయ్యాలలో బిడ్డను పెట్టుకుని ఊరంతా తిరిగినట్లు’ ఓహత్య కేసులో ముంబై పోలీసులు జైలులోనే నిందితుడిని పెట్టుకుని దేశమంతా ఏడాది కాదు రెండేళ్ల కాదు ఏకంగా 20 ఏళ్లు గాలించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. చోటా షకీల్ గ్యాంగ్‌కు చెందిన షార్ప్‌షూటర్ మహిర్ సిద్ధిఖీ (43) కోసం పోలీసులు 20 ఏళ్లుగా దేశమంతా గాలించారు ముంబైపోలీసులు. కానీ అతను మాత్రం మరో కేసులో ఇరుక్కుని జైలులోనే ఉన్నాడు. ఈ విషయం తెలియని పోలీసులు మాత్రం దేశమంతా అతని కోసం గాలించారు. అలా 20 ఏళ్లుగడిచిపోయాయి. అయినా దొరకలేదని ఉస్సురుమన్నారు ముంబైపోలీసులు. ఆ తరువాత అతను అండర్ ట్రయల్ జైలులో ఉన్నాడని తెలిసి షాక్ అయ్యారు. పోలీసులే కాదు న్యాయమూర్తి ఏఎమ్ పాటిల్ కూడా షాక్ అయ్యారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తంచేశారు. దీంతో ఈకేసును ‘అన్‌సాల్వ్‌డ్ మిస్టరీ’గా అభివర్ణించారు.

గ్యాంగ్‌స్టర్ చోటా షకీల్ గ్యాంగ్‌కు చెందిన షార్ప్ షూటర్ మహిర్ సిద్ధిఖీ మరో వ్యక్తితో కలిసి 1999లో బాంబే అమన్ కమిటీ చీఫ్ వాహిద్ అలీఖాన్‌ను హత్య చేశాడు. ఆ తరువాత అక్కడనుంచి పారిపోయాడు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిద్థిఖీ కోసం గాలింపు మొదలుపెట్టారు 1999 నుంచి. కానీ అతను మాత్రం కనిపించలేదు. ఆచూకీ లభించలేదు. చివరికి 2019లో మే 29న అతడిని అరెస్ట్ చేశారు. చోటా షకీల్ ఆదేశాలతోనే సిద్ధిఖీ ఆ హత్య చేశాడని..ఇక అప్పటినుంచి పోలీసుల కళ్లు కప్పి తిరుగుతూ ఉన్న అతడిని అరెస్ట్ చేసినట్టు కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఈకేసు విచారణను మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైం యాక్ట్ కేసుల ప్రత్యేక జడ్జి ఏఎం పాటిల్ చేశారు.

ఈ విచారణ సందర్భంగా అసలు విషయం బయటపడింది. హత్య కేసులో నిందితుడు సిద్దిఖీని 2019లో పోలీసులు అరెస్ట్ చేయగా..అంతకుముందు అంటే 2014 సెప్టెంబర్ 3 నుంచి సిద్ధిఖీ ఐదేళ్లపాటు మరో కేసులో అతడు అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నట్టు గుర్తించారు. సీఐడీ పోలీసులు సిద్ధిఖీని అరెస్ట్ చేసి అండర్ జైల్లో పెట్టారు. అంటే జైల్లోనే ఉన్న నిందితుడి కోసం పోలీసులు 20 ఏళ్లు గాలించారని వెల్లడైంది. దీనిపై న్యాయమూర్తి పాటిల్ అసహనం వ్యక్తంచేశారు. రికార్డులు పక్కాగా ఉన్నప్పటికీ నిందితుడిని పోలీసులు గుర్తించటంలో విఫలమయ్యారంటూ చీవాట్లు వేశారు. దీనిని ‘అన్‌సాల్వ్‌డ్ మిస్టరీ’గా అభివర్ణిస్తూ కేసును కొట్టివేశారు.