కిరాతకుడు: భార్యపై హత్యాయత్నం

  • Published By: chvmurthy ,Published On : February 1, 2019 / 03:45 PM IST
కిరాతకుడు: భార్యపై హత్యాయత్నం

నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటగిరి పాత బస్టాండ్ సెంటర్లో దారుణం జరిగింది. తాళి కట్టిన భర్తే కిరాతకంగా భార్యపై దాడి చేసి హత్య చేయబోయాడు. డక్కిలి మండలం తీర్థంపాడు గ్రామానికి చెందిన రవణమ్మ అనే మహిళపై భర్త గురువయ్య దాడి చేసి చంప బోయాడు. వెంకటగిరి పాత బస్టాండ్ సెంటర్లో ఒంటరిగా వస్తున్న తన భార్యపై గురవయ్య ఇటుక రాయితో ఆమె మొహంపై క్రూరంగా  కొట్టి చంపే యత్నం చేశాడు. 
గురవయ్య గతంలో తన అత్తమామలపై దాడి చేసి, అత్తను నరికి చంపివేశాడు. మామగారు గాయాలతో బయటపడ్డాడు. అత్తను చంపిన నేరానికి జైలుకు వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చాడు. గురవయ్య శుక్రవారం  రాత్రి 7గంటల సమీపంలో తన భార్య పై హత్యా ప్రయత్నం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
అక్కడే ఉన్న స్థానికుల సహాయంతో ఆమెను వెంకటగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని రవణమ్మను విచారించగా భర్త చంపేయత్నం చేశాడని పోలీసులకు తెలిపింది. ఆమె పరిస్థితి విషమించడంతో 108 అంబులెన్స్ లో గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  గురవయ్య కోసం గాలిస్తున్నారు.