Illegal Affair Murder : నేను వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమెతో నువ్వెలా……

ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకునే  విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన గొడవలు కారణంగా నిండు ప్రాణం బలయ్యిుంది. నల్గోండ జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం అడివెంలలో జూలై 2న సైదులు అనేవ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు నాలుగు రోజుల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు.

Illegal Affair Murder : నేను వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమెతో నువ్వెలా……

Murder In Nalgonda District

Illegal Affair Murder : ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకునే  విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన గొడవలు కారణంగా నిండు ప్రాణం బలయ్యిుంది. నల్గోండ జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం అడివెంలలో జూలై 2న సైదులు అనేవ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు నాలుగు రోజుల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు.

అదే గ్రామానికి చెందిన బొర్ర శైలేందర్ అనే వ్యక్తి గ్రామానికి చెందిన ఒక మహిళతో 10 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఏడాది క్రితం శైలేందర్ వేరే మహిళను  పెళ్లి చేసుకున్నాడు. గత 4 నెలలుగా వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో మనస్పర్ధలు వచ్చి ఆమెకు దూరంగా ఉంటున్నాడు.

అదే సమయంలో గ్రామానికి చెందిన శతకోటి  సైదులు(27) అనే వ్యక్తితో   ఆ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది తెలిసిన శైలేంద్ర, సైదులును పలుమార్లు హెచ్చరించాడు. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్నమహిళతో, నువ్వు మళ్లీ ఎలా వివాహేతర సంబంధం పెట్టుకుంటావని గొడవపడ్డాడు. అయినా సైదులు మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించ సాగాడు.

దీంతో సైదులుపై కక్ష పెంచుకున్నశైలేంద్ర తన స్నేహితుడు సతీష్ తో కలిసి సైదులును హత్యచేయటానికి పధకం వేశాడు. అందులో భాగంగా జూన్ 29న వేసుకున్న ప్లాన్ సక్సెస్ కాలేదు. మళ్లీ ఈనెల 2వ తేదీన ప్లాన్ చేశారు. ఆ రోజు రాత్రి సైదులు గ్రామంలోని ఓ బెల్టు దుకాణంలో మద్యం సేవిస్తున్నాడు. మూత్ర విసర్జన కోసం బయటకు వచ్చాడు.

ఆ సమయంలో, శైలేంద్ర తన స్నేహితుడు సతీష్ తో కలిసి సైదులు మెడపై కత్తితో నరికి పరారయ్యాడు. కేసునమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి కాల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించారు. మంగళవారం నిందితులు శైలేంద్ర, సతీష్ లను అదుపులోకి తీసుకుని కోర్టులో హజరు పరిచారు.