అమ్మాయిలతో వల్గర్ డ్యాన్స్.. ఆపై రేప్!

ఇక్కడ అమ్మాయిలే టార్గెట్.  బలవంతంగా లాక్కెళ్లడం.. డ్రగ్స్ అలవాటు చేయడం.. వారితో వల్గర్ డ్యాన్స్ చేయించడం.. ఆపై అత్యాచారం చేయడం.. ఇప్పుడు ఈ వార్త బిహార్ రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది.

  • Published By: sreehari ,Published On : January 7, 2019 / 05:05 AM IST
అమ్మాయిలతో వల్గర్ డ్యాన్స్.. ఆపై రేప్!

ఇక్కడ అమ్మాయిలే టార్గెట్.  బలవంతంగా లాక్కెళ్లడం.. డ్రగ్స్ అలవాటు చేయడం.. వారితో వల్గర్ డ్యాన్స్ చేయించడం.. ఆపై అత్యాచారం చేయడం.. ఇప్పుడు ఈ వార్త బిహార్ రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది.

ఇక్కడ అమ్మాయిలే టార్గెట్.  బలవంతంగా లాక్కెళ్లడం.. డ్రగ్స్ అలవాటు చేయడం.. వారితో వల్గర్ డ్యాన్స్ చేయించడం.. ఆపై అత్యాచారం చేయడం.. ఇప్పుడు ఈ వార్త బిహార్ రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఓ షెల్టర్ లో ఈ తతంగం వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సీబీఐ అధికారులు ఇన్విస్టిగేట్ స్టార్ట్ చేయడంతో దీని వెనుక పెద్ద తలకాయలే ఉన్నాయనే అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు 73 పేజీల చార్జ్ షీట్ ను ఫైల్ చేసి షెల్టర్ యజమాని బ్రజేష్ థాకూర్ సహా 20 మందిని పోస్కో చట్టం కింద అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. స్టేట్ గెస్ట్ హౌస్ లో యువతులందరిని తీసుకెళ్లి వారిని చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా అమ్మాయిలతో వల్గర్ డ్యాన్స్ లు వేయించారని, స్పృహ కోల్పోయాక వారిపై అత్యాచారం చేస్తున్నట్టు సీబీఐ విచారణలో వెల్లడించింది.

పది ఏళ్లుగా డజన్లకు పైగా అమ్మాయిలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నప్పటికీ షెల్టర్ నిర్వహిస్తున్న థాకూర్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అక్కడి స్థానికులు ఆరోపిస్తున్నారు. అత్యాచారానికి గురైన యువతులకు వైద్య పరీక్షలు చేయించగా 42 మందిలో 34 మందిపై అత్యాచారం జరిగినట్టు నిర్ధారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్రజేశ్ థాకూర్ కు రాజకీయ నేతలతో దగ్గరి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో అతన్ని ముజఫర్ నగర్ నుంచి దూరంగా తీసుకెళ్లి సీబీఐ విచారించనున్నట్టు తెలుస్తోంది. స్థానికుల డిమాండ్ మేరకు అక్కడి నాలుగు అంతస్థుల షెల్టర్ ను కూల్చివేయించారు.