Atchutapuram Lodge : రక్తపు మడుగులో యువతి, గదిలో ఇంజెక్షన్-నీడిల్స్.. అచ్యుతాపురం లాడ్జిలో అసలేం జరిగింది?

Atchutapuram : ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్పడానికి కారణం లేకపోలేదు అంటున్నారు పోలీసులు. రూమ్ లో కత్తి, ఇంజెక్షన్, నీడిల్స్ చూస్తే అనుమానం కలుగుతోందన్నారు.

Atchutapuram Lodge : రక్తపు మడుగులో యువతి, గదిలో ఇంజెక్షన్-నీడిల్స్.. అచ్యుతాపురం లాడ్జిలో అసలేం జరిగింది?

Atchutapuram Lodge

Atchutapuram Mystery Death : రక్తపు మడుగులో యువతి. రూమ్ లో ఇంజెక్షన్, నీడిల్స్. యువతి శరీరంపై కత్తిపోట్లు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో దారుణం జరిగింది. ఓ లాడ్జిలో యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. అసలేం జరిగింది? యువతి ఎలా చనిపోయిందా? హంతకుడు భర్తేనా? ఇది ప్రీ ప్లాన్డ్ మర్డరా? ఇప్పుడీ మిస్టరీని చేధించే పనిలో పడ్డారు పోలీసులు.

విశాఖపట్నం జిల్లా కూర్మన్నపాలెంకు చెందిన ఎస్‌.మహాలక్ష్మి, గాజువాకకు చెందిన శ్రీనివాస్‌ సోమవారం(మే 29) అచ్యుతాపురంలోని ఓ లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. ఏం జరిగిందో కానీ.. లాడ్జిలో మహాలక్ష్మి రక్తపుమడుగులో కనిపించింది. ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయి. శ్రీనివాస్ శరీరంపైనా కత్తిపోట్లు ఉన్నాయి. దాంతో వారిద్దరూ ప్రేమికులు అని, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తొలుత అంతా అనుకున్నారు. కానీ, పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి.

లాడ్జి సిబ్బంది ఇచ్చిన సమాచాంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మహాలక్ష్మి, శ్రీనివాస్‌ కుమార్‌లను వెంటనే అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మహాలక్ష్మి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. శ్రీనివాస్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇద్దరి శరీరాలపై కత్తిపోట్లు గుర్తించారు పోలీసులు.

Also Read..Atchutapuram : మిస్టరీగా మారిన యువతి మృతి.. మహాలక్ష్మి మృతదేహానికి పోస్టుమార్టం

అయితే, పథకం ప్రకారమే తమ కూతురు మహాలక్ష్మిని శ్రీనివాస్‌ హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నుంచి తప్పించుకోవడానికే తనపై కూడా దాడి జరిగినట్టు శ్రీనివాస్ డ్రామా ఆడినట్లు చెబుతున్నారు. మహాలక్ష్మిపై కక్ష పెంచుకుని ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని కన్నీటి పర్యంతం అయ్యారు. తమ బిడ్డను తమకు కాకుండా చేసిన శ్రీనివాస్ ను ఉరి తీయాలని మహాలక్ష్మి తల్లిదండ్రులు, బంధువులు పోలీసులు డిమాండ్ చేశారు.

ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని అనుమానించడానికి కారణం లేకపోలేదు అంటున్నారు పోలీసులు. రూమ్ లో కత్తి, ఇంజెక్షన్, నీడిల్స్ చూస్తే అనుమానం కలుగుతోందన్నారు. మహాలక్ష్మి ప్రతిఘటించకుండా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆమెని చంపాలని శ్రీనివాస్ ప్లాన్ చేసి ఉండొచ్చని సందేహపడుతున్నారు.
శ్రీనివాస్, మహాలక్ష్మి ఇంటర్ నుంచి ప్రేమించుకున్నారు. రిజిస్టర్ ఆఫీస్ లో మ్యారేజ్ చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత శ్రీనివాస్ తమ కూతురిని టార్చర్ చేసేవాడని, కులం పేరుతో దూషించేవాడని మహాలక్ష్మి తల్లిదండ్రులు వాపోయారు. వేధింపులు తట్టుకోలేక శ్రీనివాస్ నుండి విడిపోయి మహాలక్ష్మి ఉంటున్నట్లు బంధువులు తెలిపారు. విడాకులకు కూడా అప్లయ్ చేసిందన్నారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని, తమ కూతురిని శ్రీనివాస్ చంపేశాడని మృతురాలి బంధువులు బోరున విలపించారు.

Also Read..Delhi Girl Case : ఢిల్లీలో 16ఏళ్ల బాలిక దారుణ హత్య.. నిందితుడు సాహిల్ అరెస్ట్.. షాకింగ్ వీడియో

పక్కా పథకం ప్రకారమే..? సత్యనారాయణమూర్తి, పరవాడ డీఎస్పీ
రూమ్ లో నుంచి కేకలు వచ్చినట్లు సిబ్బంది విన్నారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపుతట్టారు. శ్రీనివాస్ కుమార్ బాత్ రూమ్ లో ఉన్నాడు. వస్తాను వస్తాను అని అన్నాడు. దీంతో పోలీసులు బలవంతంగా తలుపులు తెరిచి లోనికి వెళ్లారు. అక్కడ మహాలక్ష్మి చనిపోయి ఉంది. ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయి. చిన్న చిన్న గాయాలతో శ్రీనివాస్ కుమార్ బాత్ రూమ్ లో అపస్మారక స్థితిలో ఉన్నాడు. రూమ్ లో ఇంజెక్షన్, నీడిల్స్ ఉన్నాయి. వెంటనే ఆ ఇద్దరినీ ఆసుపత్రికి తరలించాము. అప్పటికే యువతి చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు.

భర్త శ్రీనివాస్ ప్రవర్తన నచ్చక మహాలక్ష్మి విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించింది. ఈ కేసు వాయిదాలకు ఇద్దరూ రావడం లేదు. ఏదో ఒకరకంగా శ్రీనివాస్ కుమార్ నుంచి విడిపోయి స్వేచ్చగా బతకాలని మహాలక్ష్మి అనుకుంది. ఈ క్రమంలో శ్రీనివాస్ కుమార్ ఉద్దేశపూర్వకంగా అమ్మాయిని లాడ్జికి తీసుకెళ్లాడు. ఆమె ప్రతిఘటించకుండా ఉండేందుకు మత్తు లాంటి ఇంజెక్షన్ ఇచ్చాడా? అనేది తెలియాల్సి ఉంది. లేదంటే.. కేకలు కూడా వినపడ్డాయి కనుక.. విచక్షణారహితంగా కత్తితో మహాలక్ష్మిని పొడిచాడా? తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనే శ్రీనివాస్ కుమార్ పొడుచుకున్నాడా? అనేది దర్యాఫ్తులో తేలుతుంది. సీసీ ఫుటేజీ కూడా వెరిఫై చేస్తున్నాం.