విజయవాడ ప్రేమోన్మాది ఘటనలో కొత్త ట్విస్ట్

  • Published By: sreehari ,Published On : October 15, 2020 / 04:30 PM IST
విజయవాడ ప్రేమోన్మాది ఘటనలో కొత్త ట్విస్ట్

Tejaswini Murder Case : విజయవాడ ప్రేమోన్మాది ఘటన కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. దివ్య తేజస్విని హత్యకేసు మరో కీలక మలుపు తిరిగింది. దివ్య, నాగేంద్రబాబు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారంట.. తేజస్విని, నాగేంద్ర బాబు ఇటీవలే ప్రేమించుకుని రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే విషయాన్ని నాగేంద్ర బాబు సోదరుడు నాగరాజు బయటపెట్టాడు.



నాగేంద్రబాబును పెళ్లి చేసుకోవడం తేజస్విని కుటుంబ సభ్యులకు నచ్చలేదని చెప్పాడు. పెళ్లి అంశంపై గత రాత్రి దివ్య తేజస్విని తల్లిదండ్రులతో నాగేంద్ర మాట్లాడారని తెలిపాడు. నాగేంద్ర పెళ్లి వ్యవహారం తమ కుటుంబ సభ్యులకు తెలియదని సోదరుడు చెప్పాడు.



ఈ పెళ్లి విషయం ఇంట్లో తెలిసి దివ్యను హౌస్ అరెస్ట్ చేశారని తెలిపాడు. నాగేంద్రతో దివ్య తండ్రి గొడపడినట్లు కూడా అతని సోదరుడు తెలిపాడు. అయితే నాగేంద్ర, తేజస్విని పెళ్లి విషయం ఇంట్లో తెలిసిన తర్వాతే గొడవ జరిగిందా?



పెద్దలు ఒప్పుకోరనే తమకు పెళ్లి జరిగిందనే విషయాన్ని ఇంతకాలం చెప్పలేదా? అనే అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.దివ్య, నాగేంద్ర ప్రేమించుకున్నారన్న విషయంపై స్పష్టత లేదని పోలీసులు అంటున్నారు.

బెజవాడలోని క్రీస్తురాజపురంలో ఓ ప్రేమోన్మాది దాడిలో ఇంజనీరింగ్‌ విద్యార్థిని తేజస్విని ప్రాణాలు కోల్పోయింది. మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలో ఈఘటన జరిగింది. నాలుగేళ్లుగా ప్రేమించిన అమ్మాయిపై ఇంటికి వెళ్లి మరీ దాడి చేశాడు నాగేంద్ర అనే ప్రేమికుడు.

కత్తితో విచక్షణా రహితంగా గొంతుకోసి ఆపై తానూ గాయపరచుకున్నాడు. నాగేంద్ర దాడిలో తేజస్విని ఈఎస్‌ఐ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తన కళ్లముందే కూతురిపై దాడి చేయడంతో.. ఆమె తల్లి కన్నీరు మున్నీరవుతోంది. నాలుగేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.