Ganja : ఒడిషా నుంచి తెలంగాణకు తరలిస్తున్న కోటి రూపాయల గంజాయి పట్టివేత
ఒడిషా లోని మల్కన్ గిరి జిల్లాలోని కలిమెల సమితి ఎంపీవీ-31 గ్రామం వద్ద బుధవారం రాత్రి మల్కన్ గిరి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆసమయంలో చింతపండు లోడుతో వెళుతున్న లారీని
Ganja : ఒడిషా లోని మల్కన్ గిరి జిల్లాలోని కలిమెల సమితి ఎంపీవీ-31 గ్రామం వద్ద బుధవారం రాత్రి మల్కన్ గిరి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆసమయంలో చింతపండు లోడుతో వెళుతున్న లారీని గుర్తించారు.
లారీ డ్రైవర్ లారీని ఆపకుండా వేగంగా పోనిచ్చేసరికి అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించి లారీని ఆపారు. లారీలో చింతపండు ఉందని డ్రైవర్ కన్నరామ్ చౌదరి, వ్యాపారి ప్రతాప్ పాత్రో చెప్పారు. కాగితాలు చూపించారు. అయినా అనుమానం వచ్చిన పోలీసులు లారీలో తనిఖీ చేయగా చింతపండు బస్తాల మధ్యలో దాచి రవాణా చేస్తున్న గంజాయి బయటపడింది.
Also Read : Delhi : విద్యార్ధినిని వేధిస్తున్న రైల్వే ఉద్యోగి అరెస్ట్
స్వాధీనం చేసుకున్న 15 క్వింటాళ్ల గంజాయిని 63 బస్తాల్లో నింపి రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలుసు కున్నారు. గంజాయి విలువ కోటి రూపాయలు పైగా ఉంటుందని మల్కన్ గిరి ఎస్డీపీఓ సువేందు కుమార్ పాత్రో తెలిపారు. గంజాయిని తెలంగాణకు తరలిస్తున్నట్లు నిందితులు తెలిపారు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి మల్కన్ గిరి కోర్టులో హజరు పరిచారు.