కోరిక తీర్చమని కోడలికి వేధింపులు…కొడుకు చేతిలో హత్య

కూతురుతో సమానమైన కోడలిపై కన్నేశాడు ఓ మాఁవగారు. తండ్రిలా  రక్షించాల్సినవాడే కామంతో కాటేశాడు. కోడుకులేని సమయం చూసి  చేయి పట్టుకుని బలాత్కారం చేయబోయాడు. తన భార్యపై తండ్రి వేధింపులు తెలిసిన కొడుకు తండ్రిని హత్య చేశాడు.

  • Published By: chvmurthy ,Published On : March 17, 2020 / 10:28 AM IST
కోరిక తీర్చమని కోడలికి వేధింపులు…కొడుకు చేతిలో హత్య

కూతురుతో సమానమైన కోడలిపై కన్నేశాడు ఓ మాఁవగారు. తండ్రిలా  రక్షించాల్సినవాడే కామంతో కాటేశాడు. కోడుకులేని సమయం చూసి  చేయి పట్టుకుని బలాత్కారం చేయబోయాడు. తన భార్యపై తండ్రి వేధింపులు తెలిసిన కొడుకు తండ్రిని హత్య చేశాడు.

కూతురుతో సమానమైన కోడలిపై కన్నేశాడు ఓ మాఁవగారు. తండ్రిలా  రక్షించాల్సినవాడే కామంతో కాటేశాడు. కోడుకులేని సమయం చూసి  చేయి పట్టుకుని బలాత్కారం చేయబోయాడు. తన భార్యపై తండ్రి వేధింపులు తెలిసిన కొడుకు తండ్రిని హత్య చేశాడు. 

తూర్పుగోదావరి జిల్లా  యు.కొత్తపల్లి  మండలం శ్రీరాంపురంలో ఉండే పిర్ల తమ్మారావు(55) కి ఇద్దరు కొడుకులు. ఆదినారాయణ, సుబ్బారావు.   ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసిన తమ్మారావు భార్య దండమ్మ,  చిన్న కొడుకు సుబ్బారావుతో  కలిసి ఉమ్మడిగా ఉంటున్నాడు.  ఆదినారాయణ అదే ఇంటిలో వేరే పోర్షన్ లో  విడిగా ఉంటున్నాడు. తమ్మారావు ఉప్పాడ-పెరుమాళ్లరపురం బీచ్ రోడ్ లో  తనకున్న ఎకరం పొలంలో  వ్యవసాయం చేసుకుంటూ.. గేదెలను మేపుకుంటూ  జీవనం సాగిస్తున్నాడు. 

తమ్మారావు కు పెద్ద కోడలు పై మోజు కలిగింది. అది ఎప్పటి నుంచి మనసులో ఉందో తెలీదు కానీ..మార్చి13 న ఆదినారాయణ ఇంట్లో లేని సమయంలో కొడుకు ఇంటికి వెళ్లి కోడలిని కోరిక తీర్చమని చెయ్యిపట్టుకుని లెైంగికంగా  దాడి చేయబోయాడు. ఆమె ససేమిరా అంది. కొడుక్కి తెలియకుండా తనతో అక్రమ సంబంధం కొనసాగించమని  వేధించసాగాడు. 

అప్పటికి మామగారి నుంచి తప్పించుకుని బయట పడింది. అదే రోజు రాత్రి భర్తకు మావ చేసిన పని చెప్పింది.  దీంతో ఆదినారాయణ తండ్రితో గొడవపడ్డాడు. కొడుకుకు భయపడిన తండ్రి శనివారం నుంచి ఇంటికి రాకుండా పొలం దగ్గరే ఉంటున్నాడు.  

ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఆదినారాయణ  తండ్రిపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా తుద ముట్టించాలనుకున్నాడు. ఆదివారం రాత్రి పొలం దగ్గరకు వెళ్లాడు. నిద్రపోతున్న తండ్రి తమ్మారావు తలపై బండరాయితో బలంగా కొట్టి హత్య చేసి పరారయ్యాడు.  

Also Read | కరోనా భయాల మధ్య మంచి వార్త. ఇండియాలో 13మందికి కరోనా నయమైంది, ఎయిడ్స్ మందులు పనికొస్తున్నాయి…

సోమవారం ఉదయం పొలానికి వెళ్లిన  భార్య దండమ్మ భర్త హత్య చేసి ఉండటంచూసి ఏడ్వటం మొదలెట్టింది. ఈ విషయం గ్రామంలోతెలిసి గ్రామస్తులందరూ పొలానికి చేరుకున్నారు. సమచారం తెలుసుకున్న కాకినాడ పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకున్న పోలీసులు  నిందితుడు ఆదినారాయణ కోసం గాలిస్తున్నారు.

kakinada murder