Ongole : అప్పుల బాధ-పిల్లలతో సహా రైతు ఆత్మహత్య

ప్రకాశం జిల్లా బల్లికురవ  మండలం గుంటుపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రాల చిరంజీవి  అనే రైతు  తన ఇద్దరు పిల్లలతో కలిసి వల్లాపల్లి వద్ద ఉన్న అద్దంకి బ్రాం

Ongole : అప్పుల బాధ-పిల్లలతో సహా రైతు ఆత్మహత్య

Ongole Farmer

Ongole :  ప్రకాశం జిల్లా బల్లికురవ  మండలం గుంటుపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రాల చిరంజీవి  అనే రైతు  తన ఇద్దరు పిల్లలతో కలిసి వల్లాపల్లి వద్ద ఉన్న అద్దంకి బ్రాంచ్ కెనాల్ లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చిరంజీవి  కొంతకాలంగా వ్యవసాయం చేస్తూ అప్పుల పాలయ్యాడు. పంటలు సరిగా పండక సుమారు 20 లక్షల రూపాయలు వరకు అప్పులు చేశాడు.

ఈ క్రమంలో కుటుంబంలో గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం తన ఇద్దరు పిల్లలు సాయి చైతన్య కృష్ణ(10), సౌమ్య(8)ను తీసుకుని కోటప్పకొండ వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన చిరంజీవి వల్లాపల్లి వద్ద ఉన్న అద్దంకి బ్రాంచ్ కెనాల్ వద్ద తన వాహనాన్ని ఉంచి తన ఇద్దరు పిల్లలతో కలిసి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Also Read : Khammam : కోదాడకు చెందిన యువకుడు ఖమ్మంలో ఆత్మహత్య
ఈరోజు ఉదయం అయినా చిరంజీవి పిల్లలు ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు వెతకటం ప్రారంభించగా చిరంజీవి వాహనం చెప్పులు వల్లాపల్లి కాలువ వద్ద ఉండటంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు కాలువలో వెతుకుతూ పోలీసులకు సమాచారం అందించారు. చిరంజీవి మృతదేహం మార్టూరు మండలం బొల్లాపల్లి వద్ద పోలీసులు గుర్తించారు. ఇద్దరు పిల్లల మృతదేహాల కోసం పోలీసులు, స్థానికులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.