Online Cyber Fraud : ఉచిత ఇన్సూరెన్స్ పేరుతో కేటుగాళ్ల మాయాజాలం

టెక్నాలజీ వినియోగం పెరిగి ప్రజలకు సౌకర్యంగా ఉండటం ఏమోకానీ సైబర్ నేరగాళ్లు మాత్రం ఎన్నిరకాలుగా మోసం చేయోచ్చో అన్ని రకాలుగా ప్రజలను మోసం చేయాటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.

Online Cyber Fraud : ఉచిత ఇన్సూరెన్స్ పేరుతో కేటుగాళ్ల మాయాజాలం

Online Cyber Fraud

Online Cyber Fraud : టెక్నాలజీ వినియోగం పెరిగి ప్రజలకు సౌకర్యంగా ఉండటం ఏమోకానీ సైబర్ నేరగాళ్లు మాత్రం ఎన్నిరకాలుగా మోసం చేయోచ్చో అన్ని రకాలుగా ప్రజలను మోసం చేయాటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.

మీ పేరుతో ఉచితంగా ఇన్సూరెన్స్ వచ్చింది అంటూ హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి సైబర్ నేరస్తుల చేతిలో రూ. 98 వేలు పోగొట్టుకున్న ఉదంతం వెలుగు చూసింది. జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని చింతల్‌ ప్రసూన నగర్‌కు చెందిన గుళ్లపల్లి కిషోర్‌ ప్రైవేట్‌ సంస్ధలో ఉద్యోగం చేస్తుంటాడు.

ఇతను స్టాండర్డ్‌ చార్టెడ్‌ క్రెడిట్‌ కార్డును ఉపయోగిస్తున్నాడు. ఏప్రిల్ నెల 29న కిషోర్‌ ఫోన్‌కు వరినీక అనే పేరుతో ఓ అమ్మాయి ఫోన్‌ చేసి తాను స్టాండర్డ్‌ చార్టెడ్‌ క్రెడిట్‌ కార్డు కస్టమర్‌ కేర్‌ నుంచి మాట్లాడుతున్నానని హిందీలో మాట్లాడి పరిచయం చేసుకుంది.

అనంతరం మీ క్రెడిట్‌ కార్డు నెంబర్ ఉచిత ఇన్సూరెన్స్ పధకానికి ఎంపికైందని చెప్పి అతడి వివరాలు అడిగి తీసుకుంది. దీంతో కిషోర్‌ తన పేరు, కార్డ్‌ నంబర్, పుట్టిన తేదీ, కార్డు వ్యాలిడిటీ అన్నీ చెప్పాడు. అనంతరం మీ ఫోన్ కు ఓటీపీ వస్తుంది… అది చెప్పండి అని అడగ్గా కిషోర్‌ ఆమెను గుడ్డిగా నమ్మి ఫోన్ కు వచ్చిన ఓటీపీ చెప్పేశాడు.

వెంటనే అతడి క్రెడిట్‌ కార్డు నుంచి రూ.98 వేలు వాడుకున్నట్లు మెసేజ్ వచ్చింది. ఈ విషయాన్ని సదరు అమ్మాయికి తెలపగా మళ్లీ ఇంకో ఓటీపీ వస్తుందని, అది చెప్తే రూ.98 వేలు తిరిగి మీ అకౌంట్‌కు వస్తాయని చెప్పింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన కిషోర్‌ ఫోన్‌ కట్‌ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.