Hyderabad : శంషాబాద్ విమానాశ్రయంలో అరకిలో బంగారం స్వాధీనం
శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు ఒక ప్రయాణికుడి నుంచి అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad : శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు ఒక ప్రయాణికుడి నుంచి అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నడకపై అనుమానం వచ్చిన అధికారులు అతడిని క్షుణ్ణంగా పరీక్షించారు.
లోదుస్తులలో ప్రత్యేకంగా కుట్టించుకున్న ప్యాకెట్లలో 478.52 గ్రాముల బంగారాన్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.24.82 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అధికారులు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Cannabis : విశాఖ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత