విమానంలో సిగరెట్ కాల్చాడు.. అందుకే పేలిపోయింది

  • Published By: madhu ,Published On : January 28, 2019 / 05:38 AM IST
విమానంలో సిగరెట్ కాల్చాడు.. అందుకే పేలిపోయింది

నేపాల్ : విమానంలో పైలట్లు…సిబ్బంది..ప్రయాణీకులు..ఎవరైనా…నిబంధనలు ఫాలో కావాల్సిందే. ఓ పైలట్ సిగరేట్ కాల్చడంతో 51 మంది మృతి చెందారు. గత ఏడాది అంటే 2018 సంవత్సరంలో జరిగిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన బృందం అసలు విషయాన్ని వెల్లడించింది. విచారణలో పైలట్ సిగరేట్ తాగాడని..అందుకే ఇంతమంది చనిపోయారనే దిగ్ర్భాంతి కలిగించే అంశం వెలుగులోకి వచ్చింది. 

యూఎన్ – బంగ్లా విమానయాన సంస్థకు చెందిన బంబార్డియర్ యూబీజీ -211 విమానం త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తుండగా కుప్పకూలిపోయింది. విమానంలో మంటలు చెలరేగాయి. విమానంలో మొత్తం 67 మంది ఉండగా 51 మంది దుర్మరణం చెందారు. అధికారులు ప్యానెల్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. కాక్ పిట్ వాయిస్ రికార్డర్ పరిశీలించింది. విమానం నడుపుతున్న సమయంలో పైలట్ నిబంధనలకు విరుద్ధంగా కాక్ పిట్‌లో పొగ తాగినట్లు నిర్ధారించారు. సిబ్బంది నిర్లక్ష్యం..ల్యాండింగ్ సమయంలో అవగాహన లేకపోవడంతో ఘోర దుర్ఘటన జరిగినట్లు ప్యానెల్ అధికారులు నిర్ధారించారు.