వీడిన మిస్టరీ : అమ్మాయి కోసమే సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ హత్య

మిస్టరీ వీడింది. సంచలనం సృష్టించిన కూకట్ పల్లి సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ సతీష్ హత్య కేసులో పోలీసులు మిస్టరీని ఛేదించారు. అమ్మాయి కోసమే హత్య జరిగిందని తేల్చారు. ప్రధాన

  • Published By: veegamteam ,Published On : August 31, 2019 / 12:18 PM IST
వీడిన మిస్టరీ : అమ్మాయి కోసమే సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ హత్య

మిస్టరీ వీడింది. సంచలనం సృష్టించిన కూకట్ పల్లి సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ సతీష్ హత్య కేసులో పోలీసులు మిస్టరీని ఛేదించారు. అమ్మాయి కోసమే హత్య జరిగిందని తేల్చారు. ప్రధాన

మిస్టరీ వీడింది. సంచలనం సృష్టించిన కూకట్ పల్లి సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ సతీష్ హత్య కేసులో పోలీసులు మిస్టరీని ఛేదించారు. అమ్మాయి కోసమే హత్య జరిగిందని తేల్చారు. ప్రధాన నిందితుడు, సతీష్ స్నేహితుడు హేమంత్ ని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్ బీ) పోలీసులు ఏపీలో అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హేమంత్ ని అదుపులోకి తీసుకున్నారు. తన ప్రియురాలు ప్రియాంకను సతీష్ ట్రాప్ చేశాడని హేమంత్ కక్ష పెంచుకున్నాడు. పగతో రగిలిపోయాడు. చంపేయాలని డిసైడ్ అయ్యాడు. పక్కా ప్లాన్ తో సతీష్ ని మర్డర్ చేశాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రియాంక కోసమే సతీష్.. కూకట్ పల్లిలో రూమ్ తీసుకున్నట్టు హేమంత్ ఆరోపించాడు.

మృతుడు సతీష్, హేమంత్ ఇద్దరూ ఫ్రెండ్స్. అమ్మాయి విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఆగస్టు 27న రాత్రి సతీష్ ను హేమంత్ మర్డర్ చేశాడు. 28న తన భర్త కనిపించడం లేదని సతీష్ భార్య ప్రశాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 29న రాత్రి హేమంత్ ఇంట్లో సతీష్ మృతదేహం లభ్యమైంది. హత్య తర్వాత హేమంత్ తనకు ఏమీ తెలియనట్టు యాక్ట్ చేశాడు. సతీష్ భార్య ప్రశాంతి, స్నేహితులతో కలిసి ఉన్నాడు. సతీష్ కోసం వెతుకున్నట్టు నటించాడు. సతీష్ భార్య ప్రశాంతి పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే హేమంత్ పారిపోయాడు. 

ఈ మొత్తం వ్యవహారంలో ప్రియాంక అనే అమ్మాయి కీలకంగా మారింది. ప్రియాంక వల్లే ఫ్రెండ్స్ మధ్య గొడవలు జరిగాయి. సతీష్ ద్వారా ప్రియాంక హేమంత్ కు పరిచయమైంది. ప్రియాంకకు తన కంపెనీలో సతీష్ ఉద్యోగం ఇచ్చాడు. కొద్దిరోజులుగా హేమంత్ తో ప్రియాంక సహజీవనం చేస్తోందని పోలీసులు చెప్పారు. గతంలో సతీష్ తో చనువుగా ఉన్న ప్రియాంక ఇప్పుడు హేమంత్ కి దగ్గరైంది. ఈ విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రియాంక తనకు దూరం కావడాన్ని హేమంత్ తట్టుకోలేకపోయాడు. సతీష్ ని ఇంటికి పిలిపించి మరీ మర్డర్ చేశాడు. కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లో చిన్ననాటి స్నేహితుడిని అతి కిరాతకంగా హతమార్చిన ఘటన కలకలం రేపింది.