లాక్ డౌన్ లోనూ లాడ్జిలో భర్త రాసలీలలు, రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన భార్య

  • Published By: naveen ,Published On : May 10, 2020 / 11:37 AM IST
లాక్ డౌన్ లోనూ లాడ్జిలో భర్త రాసలీలలు, రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన భార్య

అతడికి పెళ్లైంది. భార్య ఉంది. బుద్ధిగా సంసారం చేసుకోకుండా చెడుదారి పట్టాడు. అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. లాక్ డౌన్ లోనూ అతడిలో మార్పు లేదు. ఓ లాడ్జిలో రాసలీలలు కొనసాగిస్తున్నాడు. భర్త వైఖరితో విసిగిపోయిన భార్య ఇక లాభం లేదనుకుంది. తన భర్తను పోలీసులకు పట్టించింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వెలుగు చూసింది.

అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌:
హైదరాబాద్‌ శివారులోని ఓ మున్సిపాలిటీకి వైస్ చైర్మన్‌గా ఎన్నికైన అనిల్ అనే వ్యక్తి.. లాక్‌డౌన్ సమయంలోనూ ఓ లాడ్జిలో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాడు. లాడ్జి యజమాని కూడా అనిల్‌కు తోడు కావడంతో అమ్మాయిలను పిలిపించుకుని రాసలీల్లో మునిగిపోయాడు. ఎప్పటిలాగే శనివారం కూడా పని ఉందని భార్యకి చెప్పి బయటకు వెళ్లాడు. నేరుగా లాడ్జిలో ప్రియురాలితో రాసలీలల్లో మునిగిపోయాడు. 

లాడ్జిలో వ్యభిచార ముఠా అంటూ పోలీసులకు సమాచారం ఇచ్చిన మహిళ:
అయితే, ఈ విషయాన్ని పసిగట్టిన అతని భార్య భర్తకు బుద్ధి చెప్పేందుకు పెద్ద స్కెచ్చే వేసింది. వనస్థలిపురంలో లాడ్జిలో వ్యభిచారం జరుగుతోందంటూ పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు ఆ లాడ్జిపై రైడ్ చేశారు. ఆ సమయంలో రూమ్ లో ముగ్గురు అమ్మాయిలు, అనిల్, లాడ్జి యజమాని సునీల్‌ ఉన్నారు. వారందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలా ఆ భార్య తన భర్తకు బుద్ధి చెప్పింది.