ఆ ఆశతోనే చంపేశారు : సంచలనం రేపిన అనంత ట్రిపుల్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ

అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో పోలీసులు మిస్టరీని చేధించారు. ముగ్గురి హత్యకు కారణం ఏంటో తెలుసుకున్నారు. గుప్త నిధుల కోసమే ముగ్గురిని

  • Published By: veegamteam ,Published On : November 5, 2019 / 12:13 PM IST
ఆ ఆశతోనే చంపేశారు : సంచలనం రేపిన అనంత ట్రిపుల్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ

అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో పోలీసులు మిస్టరీని చేధించారు. ముగ్గురి హత్యకు కారణం ఏంటో తెలుసుకున్నారు. గుప్త నిధుల కోసమే ముగ్గురిని

అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో పోలీసులు మిస్టరీని చేధించారు. ముగ్గురి హత్యకు కారణం ఏంటో తెలిపారు. గుప్త నిధుల ఆశతో ముగ్గురిని మర్డర్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులంతా పాతికేళ్లలోపు వారే అని పోలీసులు వెల్లడించారు. మర్డర్లు చేశాక ఆలయంలో తవ్వకాలకు సమయం లేకపోవడంతో నిందితుడు వెనక్కి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పట్టుకున్నామని చెప్పారు.

అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొర్తికోట శివాలయంలో జూలై 14న అర్థరాత్రి ముగ్గురు వ్యక్తులను దుండగులు హత్య చేశారు. శివాలయంలో నిద్రిస్తున్న ముగ్గుర్ని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి చంపడం కలకలం రేపింది. ఈ ఘటనలో కమలమ్మ, సత్యలక్ష్మి, శివరామిరెడ్డిలు చనిపోయారు.

ఈ హత్యలకు ముందు క్షుద్ర పూజలు చేసినట్లు.. గుప్త నిధుల కోసమే ముగ్గుర్ని చంపినట్లు పోలీసులు అనుమానించారు. వారి అనుమానమే నిజమైంది. గుప్త నిధుల కోసమే మర్డర్ జరిగినట్టు పోలీసులు తేల్చారు.

కొర్తికోటలో పురాతనమైన శివాలయం ఉంది. ఇది శిథిలావస్థకు చేరటంతో దాని స్థానంలో రిటైర్డ్ టీచర్ శివరామిరెడ్డి (75) కొత్త ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. దీనికి ఆయన సోదరి కమలమ్మ, బెంగళూరు నివాసి సత్యలక్ష్మి సహకరించారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలో నిద్రిస్తున్న ఈ ముగ్గురూ అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారు.

శివరామిరెడ్డి, కమలమ్మ(70), సత్యలక్ష్మి(70) గొంతుకోసి బండరాళ్లతో కొట్టి చంపారు. చనిపోయిన వారి రక్తాన్ని శివుడి విగ్రహానికి అభిషేకం చేశారు. ఆలయం సమీపంలో ఉన్న పాముల పుట్టల్లో కూడా రక్తాన్ని పోశారు. ట్రిపుల్ మర్డర్ స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేశారు. చివరికి మిస్టరీని చేధించారు.