Hayath Nagar Rajesh Case : ప్రైవేట్ ఫొటోలు పంపిన టీచర్ సుజాత, ఆమె అంటే పిచ్చి ప్రేమ- హయత్‌నగర్ రాజేశ్ కేసులో సంచలన విషయాలు

Teacher Sujatha : ప్రతిరోజూ కలవాలని, మాట్లాడాలని టీచర్ సుజాతపై రాజేశ్ ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలో చనిపోదామని ఇద్దరూ నిర్ణయించారు.

Hayath Nagar Rajesh Case : ప్రైవేట్ ఫొటోలు పంపిన టీచర్ సుజాత, ఆమె అంటే పిచ్చి ప్రేమ- హయత్‌నగర్ రాజేశ్ కేసులో సంచలన విషయాలు

Hayath Nagar Rajesh Case (Photo : Google)

Teacher Sujatha – Rajesh : సంచలనం రేపిన హయత్ నగర్ రాజేశ్ మృతి కేసు విచారణలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టీచర్ సుజాత, రాజేశ్ ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఏడాదిన్నర క్రితం రాజేశ్ ఇచ్చిన మిస్డ్ కాల్ తో టీచర్ సుజాత పరిచయమైంది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.

టీచర్ సుజాత, రాజేశ్.. హద్దు మీరి ప్రవర్తించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. టీచర్ సుజాత తన ప్రైవేట్ ఫొటోలను సైతం రాజేశ్ కు పంపింనట్లు పోలీసులు గుర్తించారు. సుజాతపై రాజేశ్ విపరీతంగా ప్రేమ పెంచుకున్నాడని, సుజాత ఇంటి చుట్టూ రోజు ప్రదక్షిణలు చేసేవాడని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో రాజేశ్ ప్రవర్తనతో సుజాత ఒత్తిడికి లోనైంది. ప్రతిరోజూ కలవాలని, మాట్లాడాలని సుజాతపై రాజేశ్ ఒత్తిడి తెచ్చాడు. ఇదే సమయంలో చనిపోదామని ఇద్దరూ నిర్ణయించారు.

Also Read..Mahalakshmi Case: రైతు భరోసా కేంద్రం ఉద్యోగిని మహాలక్ష్మి హత్య కేసులో విస్తుగొలిపే వాస్తవాలు

మే 24న చివరి సారిగా రాజేష్, సుజాత కలుసుకున్నారు. పురుగుల మందు తాగి చనిపోవాలని డిసైడ్ అయ్యారు. హయత్ నగర్ లో ఒక షాపులో పురుగుల మందు కొనుగోలు చేశారు. మే 24న ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగేసింది సుజాత. సుజాత పురుగుల మందు తాగిన విషయం తెలుసుకున్న రాజేశ్.. మే 26న అతడు కూడా పురుగుల మందు తాగాడు. టీచర్ సుజాతను ఆమె భర్త నాగేశ్వరరావు ఆసుపత్రిలో చేర్పించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. సుజాత మే 29న చనిపోయింది. అదే రోజున రాజేశ్ మృతదేహాన్ని పోలీసులు గురించారు. రాజేశ్, సుజాత ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఈ కేసుని పోలీసులు చేధించారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఆధారాలు సేకరించారు.

Also Read..Surat : కన్న కూతుర్ని క్రూరంగా 25 సార్లు కత్తితో పొడిచి.. భార్యపై దాడి చేసిన వ్యక్తి

సుజాత(45).. హయత్‌నగర్‌లో ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తోంది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడాది క్రితం ములుగుజిల్లా పంచోత్కులపల్లికి చెందిన రాజేష్(25) తో మిస్డ్ కాల్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. చివరికి ఇద్దరి చావుకి కారణమైంది.