రూ.11 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

విశాఖ జిల్లా ఖాసీంకోట మండలం తాళ్లపాలెంలో రూ.11 లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

  • Published By: veegamteam ,Published On : October 26, 2019 / 02:34 PM IST
రూ.11 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

విశాఖ జిల్లా ఖాసీంకోట మండలం తాళ్లపాలెంలో రూ.11 లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

విశాఖ జిల్లా ఖాసీంకోట మండలం తాళ్లపాలెంలో రూ.11 లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. లారీలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 51 వేల నగదు, రెండు సెల్ ఫోన్స్, గంజాయి ఉన్న లారీని స్వాధీనం చేసుకున్నారు.

బీహార్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు చింతపల్లిలో గంజాయి కొనుగోలు చేసి, చోడవరం, అనకాపల్లి మీదుగా వెళ్తున్నారు. పక్కా సమాచారంతో వారిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.