నిద్రిస్తున్న పాప పైనుంచి దూసుకెళ్లిన పోలీసు వాహనం

యాదగిరిగుట్ట పాత నర్సింహస్వామి ఆలయం దగ్గర ఘోరం జరిగింది.

  • Published By: veegamteam ,Published On : May 9, 2019 / 11:18 AM IST
నిద్రిస్తున్న పాప పైనుంచి దూసుకెళ్లిన పోలీసు వాహనం

యాదగిరిగుట్ట పాత నర్సింహస్వామి ఆలయం దగ్గర ఘోరం జరిగింది.

యాదగిరిగుట్ట పాత నర్సింహస్వామి ఆలయం దగ్గర ఘోరం జరిగింది. దైవ దర్శనం చేసుకుని నిద్రిస్తున్న మూడేళ్ల పాప పై నుంచి రాచకొండ పోలీసు వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో పాప తీవ్రంగా గాయపడింది. 

పోలీసుల కథనం ప్రకారం…ఓ కుటుంబం యాదగిరిగుట్ట పాత నర్సింహస్వామికి దర్శనం కోసం వెళ్లారు. దైవ దర్శనం చేసుకుని అక్కడే నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో నిద్రిస్తున్న ప్రణతి అనే మూడేళ్ల పాప పై నుంచి రాచకొండ పోలీసు వాహనం దూసుకెళ్లింది.

దీంతో ప్రణతి తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం పాపను పోలీసులు హైదరాబాద్ కామినేని ఆస్పత్రికి తరిలించారు. చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రణతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.