నాన్న (మారుతీరావు) ఎందుకు చనిపోయాడో తెలియదు – అమృత

  • Published By: madhu ,Published On : March 8, 2020 / 04:53 AM IST
నాన్న (మారుతీరావు) ఎందుకు చనిపోయాడో తెలియదు – అమృత

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్యపై ఆయన కూతురు అమృత స్పందించారు. 2020, మార్చి 08వ తేదీ ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. ఆయన చనిపోయిన విషయం తమకు ఎవరూ చెప్పలేదని, కేవలం టీవీల్లో చూసి మాత్రమే తెలుసుకున్నామంది. ప్రణయ్‌ను చంపేసిన తర్వాత అతను (మారుతీరావు) టచ్‌లో లేడని తెలిపింది. ప్రణయ్‌ను చంపిన పశ్చాతాపంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలిసిన తర్వాతే..స్పందిస్తామన్నారు. 

2020, మార్చి 08వ తేదీ ఆదివారం హైదరాబాద్‌లోని ఆర్యవైశ్యభవన్‌లో 306 రూంలో మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషం తాగి చనిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా ప్రదేశానికి చేరుకుని రూంను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీం రంగంలోకి దిగింది. రూంలో మారుతీరావు రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. తల్లి దగ్గరకు వెళ్లాలని అందులో మారుతీరావు సూచించినట్లు సమాచారం. 

2020, మార్చి 08వ తేదీ ఆదివారం హైదరాబాద్‌లోని ఆర్యవైశ్యభవన్‌లో 306 రూంలో మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషం తాగి చనిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా ప్రదేశానికి చేరుకుని రూంను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీం రంగంలోకి దిగింది. రూంలో మారుతీరావు రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. తల్లి దగ్గరకు వెళ్లాలని అందులో మారుతీరావు సూచించినట్లు సమాచారం. 
 

* తన కుమార్తె అమృత ప్రేమించి పెళ్లిచేసుకుందన్న అక్కసుతో 2018 సెప్టెంబర్‌ 14న మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రి వద్ద ప్రణయ్‌ను కిరాయి హంతకులతో మారుతీ రావు హత్య చేయించినట్టు కేసు నమోదు. 
* ఈ కేసులో పోలీసులు అరెస్ట్‌ చేయడంతో 7 నెలలపాటు జైలు జీవితం గడిపాడు.
* అనంతరం బెయిల్‌పై బయటికి వచ్చారు. 

* అమృత గర్భవతిగా ఉన్న సమయంలో వైద్య పరీక్షల నిమిత్తం  ప్రణయ్‌, ఆయన తల్లి హాస్పిటల్‌కు తీసుకెళ్లి… అక్కడ నుంచి బయటకు వస్తున్నారు. 
* ఆ సమయంలో ప్రణయ్‌ హత్య జరిగింది. 
* వెనుక నుంచి వచ్చిన నిందితుడు ప్రణయ్‌ను కత్తితో దారుణంగా నరికి హత్య చేశాడు.
 

* కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో మారుతీరావే సుపారీ ఇచ్చి ప్రణయ్‌ని హత్య చేయించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు.
* మారుతీరావుతోపాటు ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్‌, మరో వ్యక్తిపైనా పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశారు.
* ఇటీవల మిర్యాలగూడలోని మారుతీరావు షెడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం కూడా కలకలం రేపింది. 
* ఆ మృతదేహం ఎవరిది? ఆ షెడ్డులోకి ఎలా వచ్చింది? అన్నది ఇంతవరకు తేలలేదు.
* ఈ తరుణంలోనే  మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపుతోంది.

Read More : ప్రణయ్ కేసు : మారుతీరావు ఆత్మహత్యపై అనుమానాలు