ఉన్నావ్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంక గాంధీ

  • Published By: venkaiahnaidu ,Published On : December 7, 2019 / 09:46 AM IST
ఉన్నావ్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంక గాంధీ

ఉన్నావ్ బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ. రెండు రోజుల క్రితం అత్యాచారం కేసులో స్థానిక కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తున్న యువతిపై  ఐదుగురు వ్యక్తులు దాడిచేసి కిరోసిన్ పోసి తగులబెట్టిన విషయం తెలిసిందే. అయితే 95శాతం కాలిన గాయాలతో ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఆమె శుక్రవారం రాత్రి 12గంటల సమయంలో కన్నుమూసినట్లు డాక్టర్లు తెలిపారు.

ఈ సమయంలో బాధితురాలిొ కుటుంబాన్ని ఓదార్చేందుక వారి ఇంటికి వెళ్లిన ప్రియాంకగాంధీ వారికి ధైర్యం చెప్పారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏడాదిగా బాధితురాలి కటుంబం వేధింపులకు గురౌతూనే ఉందని, నిందితులకు కొందరు బీజేపీ నాయకులతో సంబంధాలున్నాయని తాను విన్నానని,అందుకే వాళ్లు సురక్షితంగా ఉన్నారని ప్రియాంకగాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్ లో నేరస్థులలో అసలు ఎలాంటి భయం లేదని ప్రియాంక అన్నారు. రాష్ట్రంలో నేరస్థులకు చోటు లేదు అని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్తున్నారని,కానీ  మహిళలకు చోటు లేని రాష్ట్రంగా మార్చేశారని ప్రియాంక ఫైర్ అయ్యారు.