లాక్ డౌన్ లోనూ యధేఛ్ఛగా వ్యభిచారం… అవాక్కైన పోలీసులు

  • Published By: chvmurthy ,Published On : April 23, 2020 / 11:58 AM IST
లాక్ డౌన్ లోనూ యధేఛ్ఛగా వ్యభిచారం… అవాక్కైన పోలీసులు

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతూ ప్రజలంతా ఇళ్లకే పరిమితమై ఉంటే అక్కడ మాత్రం వ్యభిచారం జోరుగా సాగుతోంది ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలోని వ్యభిఛారగృఙ నిర్వాహాకులే తమ వ్యాపారాలు మూసేసుకుని వెళ్ళిపోవటంతో అక్కడి వేశ్యలు డబ్బులేక,తిండి లేక అల్లాడుతున్నారు.కానీ చత్తీస్ ఘడ్ లోని బిలాస్ పూర్ లో మాత్రం వ్యభిచార నిర్వాహాకులు మాత్రం తమ వ్యాపారాన్ని యధేఛ్ఛగా కొనసాగిస్తున్నారు.

కరోనా కట్టడికి ప్రజల మధ్య భౌతిక దూరం పాటించాలని పోలీసులు,డాక్టర్లు నెత్తినోరు కొట్టుకుని చెపుతుంటే  బిలాస్ పూర్లో మాత్రం వ్యభిచార నిర్వాహాకులు  యువతులు శరీరాలతో వ్యాపారం యధేఛ్ఛగా కొనసాగిస్తున్నారు.  చత్తీస్ ఘడ్లోని బిలాస్ పూర్ లో మహిళల శరీరాలతో వ్యాపారం చేస్తూ రెండు చేతులా డబ్బులు సంపాదిస్తున్న సెక్స్ రాకెట్ ను పోలీసులు చేధించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళా బ్రోకర్ తో పాటు ఇద్దరు సెక్స్ వర్కర్లు , ఓ విటుడుని అదుపులోకి తీసుకున్నారు.

బిలాస్ పూర్ లోని ఖమ్ తైర్ లో  లాక్ డౌన్ టైంలోనూ వ్యభిచారం జరుగుతోందనే సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్లాన్ వేశారు.  ఓ పోలీసును విటుడిగా బ్రోకర్ తో మంతనాలు జరిపారు. బ్రోకర్ చెప్పిన రేటుకు కొంచెం అటుఇటుగా బేరం ఆడి పోలీసు  ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడికి వెళ్లి నచ్చిన అమ్మాయిని  సెలక్ట్ చేసుకుని గదిలోకి వెళ్లాడు. 

గదిలోకి అమ్మాయిని తీసుకెళ్లిన పోలీసు ఇంక అక్కడి నుంచి  తన సహచరులకు సమాచారం ఇచ్చాడు.  అప్పటికే సిధ్దంగా ఉన్న పోలీసులు ఇంటిపై దాడి చేసి మహిళా బ్రోకర్ తో పాటు, ఇద్దరు యువతులతో అసభ్యంగా ఉన్న ఒక విటుడిని అరెస్టు చేశారు.  పట్టుబడిన సెక్స్ వర్కర్  చంతిదిహా ప్రాంతానికి చెందిన యువతిగా గుర్తించారు. 

వ్యభిచారగృహ నిర్వాహకురాలు  వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి గత ఐదేళ్ళుగా  వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  నిందితుల నుంచి రెండు స్కూటీలు, 4 సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు.  దేశవ్యాప్తంగా  అనేక రెడ్ లైట్ ఏరియాల్లో సెక్స్  వ్యాపారాన్ని మూసేసి నిర్వాహకులు వెళ్ళిపోతే చత్తీస్ ఘడ్ లో కొనసాగటంపై పోలీసులు ఆందోళన చెందుతున్నారు.