చిత్తూరు జిల్లాలో హైటెక్ వ్యభిచారం…సోషల్ మీడియాలో బేరసారాలు

  • Published By: murthy ,Published On : December 7, 2020 / 03:16 PM IST
చిత్తూరు జిల్లాలో హైటెక్ వ్యభిచారం…సోషల్ మీడియాలో బేరసారాలు

prostitution racket through social media in chittoor district : సోషల్ మీడియా ప్లాట్ ఫాం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతోందనిపిస్తోంది కొన్ని సంఘటనలు చూస్తుంటే. సోషల్ మీడియా ద్వారా చిత్తూరు జిల్లాలో వ్యభిచారం నిరంతరాయంగా సాగుతోంది. జిల్లా నుంచే కాక పక్కనున్న నెల్లూరు, తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా అమ్మాయిలను తీసుకు వచ్చి చిత్తూరు శివారు లాడ్జీలు, అపార్ట్ మెంట్ల్ అద్దెకు తీసుకుని బ్రోకర్లు యధేఛ్ఛగా వ్యాపారం నిర్వహిస్తున్నారు.

ఆన్లైన్ లో ప్రకటనలు ఇచ్చి విటులను ఆకర్షిస్తున్నారు. తిరుపతి కాల్ గర్ల్స్ ఫోటోలతోనే వెబ్ సైట్ క్రియేట్ చేయటం గమనార్హం. వాటిని చూసి ఫోన్ ద్వారా సంప్రదించిన వారికి వాట్సప్ ద్వారా ఫోటోలను, రేట్లు పంపించి బేరం కుదుర్చుకుంటున్నారు. విటులు బ్యాంక్ లోడబ్బు జమ చేయగానే ఎంపిక చేసిన లాడ్జీలకు రమ్మని విటులకు సందేశం పంపిస్తారు. అలా కాదంటే విటులు కోరిన చోటికే యువతులను వారి మనుషుల ద్వారా పంపిస్తున్నారు. అందుకు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.  మరో వైపు లాడ్జీల నిర్వాహకులతో సంబంధాలు పెట్టుకుని…లాడ్జీలోకి దిగిన వారు యువతులు కావాలంటే వారి ద్వారా కూడా యువతులను సరఫరా చేస్తున్నారు.



ఇక బహుళ ప్రాచుర్యంలో ఉన్నవాట్సప్ గ్రూప్ వ్యభిచార నిర్వాహకులకు కల్పతరువులా మారింది. యూత్ ను టార్గెట్ చేస్తూ బ్రోకర్లు ప్రత్యేక వాట్సప్ గ్రూపు లు క్రియేట్ చేస్తున్నారు. అందులో అందమైన యువతులు, మహిళల ఫోటోలు పోస్టు చేస్తున్నారు. నచ్చిన వారు సంప్రదించమని కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నారు. ఇక అక్కడి నుంచి రేట్లు, బేరసారాలు మొదలవుతున్నాయి. పేదరికంలో ఉన్న మహిళలు, యువతులకు డబ్బు ఆశ చూపించి వారిని బలవంతంగా వ్యభిచారం లోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.



పక్క రాష్ట్రాలు, జిల్లాల బ్రోకర్లతో నూ సంబంధాలు కొనసాగిస్తూ అక్కడి వారిని ఇక్కడికి, ఇక్కడి వారిని అక్కడికి పంపిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రధాన నగరాల్లో ఊరు చివరి అపార్ట్మెంట్లు స్టార్ హోటళ్లు, లాడ్జీలు తీసుకుని అమ్మాయిలను సరఫరా చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్ పరిధిలోని లాడ్జిలో ముగ్గురు విటులతోపాటు నిర్వాహకులు అమ్మాయిలు పట్టుబడిన సంగతి తెలిసిందే.



తాజాగా గత శుక్రవారం పలమనేరు కు చెందిన ముగ్గురు తిరుపతిలో వ్యభిచారం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీరిని విచారించగా ముగ్గురు కీలక వ్యక్తుల పేర్లు బయటపడ్డాయి. వారిలో ఒక మహిళ ఉండటం గమనార్హం. వారి కాల్ డేటాఆధారంగా ఈ సెక్స్ రాకెట్ గుట్టు రట్టుచేసేపనిలో పోలీసులు ఉన్నారు.