అల్లరి చేయటం నేరమా ? : తాళ్లతో కట్టేసిన హెచ్.ఎం.

  • Published By: chvmurthy ,Published On : November 29, 2019 / 04:46 AM IST
అల్లరి చేయటం నేరమా ? : తాళ్లతో కట్టేసిన హెచ్.ఎం.

అనంతపురం జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. క్లాస్ రూమ్ లో అల్లరి చేస్తున్నారనే కారణంతో చిన్నపిల్లలని కూడా చూడకుండా ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వారిని తాళ్లతో కట్టి బంధించి హింసించింది. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని మశానంపేట ప్రభుత్వం పాఠశాలలో 2,3 క్లాస్ చదువుతున్న నలుగురు విద్యార్ధులు అల్లరి చేస్తున్నారని కారణంతో వారిని తాళ్లతో కట్టి బంధించారు.

ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో విద్యార్ధి సంఘాలు ఆందోళన చేశాయి. దీంతో ఎంఈవో స్కూలుకు వెళ్లి పరిశీలించారు. అల్లరి చేస్తున్నామని హెచ్.ఎం శ్రీదేవి తాళ్లతో కట్టేసినట్లు విద్యార్ధులు చెప్పారు. కాగా… పిల్లల నిర్భంధం గురించి హైదరాబాద్ కు చెందిన బాలల హక్కుల సంఘం జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ కమీషన్ కు ఫిర్యాదు చేసింది.