ఇప్పుడైనా మార‌తారా : పోలీస్ స్టేషన్ కు నగ్నంగా నడుచుకుంటూ వెళ్లిన మహిళ

  • Published By: venkaiahnaidu ,Published On : May 13, 2019 / 11:12 AM IST
ఇప్పుడైనా మార‌తారా : పోలీస్ స్టేషన్ కు నగ్నంగా నడుచుకుంటూ వెళ్లిన మహిళ

 అత్తింటివారు ఓ కోడలిని హింసించి.. వేధించారు. ఆపై బట్టలను చింపేశారు.దీంతో బాధిత మహిళ అత్తింటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నగ్నంగానే నడిరోడ్డుపై నడుచుకుంటూ పోలీసు స్టేషన్‌ కు వెళ్లింది. ఈ అమానవీయ సంఘటన ఆదివారం(మే-12,2019) రాజస్థాన్‌ రాష్ట్రంలోని చురు జిల్లాలోని బిదాసర్ ఏరియాలో వెలుగుచూసింది.

 రాజస్థాన్‌ కు చెందిన వ్యక్తితో మహారాష్ట్రకు చెందిన మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది.భర్త పని కోసం అసోం వెళ్లాడు. ఈ క్రమంలో సదరు మహిళపై అత్త, ఆడపడుచులు కలిసి తమ ప్రతాపం చూపించారు. ఆమెను దారుణంగా వేధింపులకు గురి చేశారు. చివరకు కోడలి బట్టలు చింపేశారు. తనకు ప్రాణహాని ఉందని గ్రహించిన బాధితురాలు…అత్తింటివారిపై కంప్లెయింట్ చేసేందుకు పోలీస్ స్టేషన్ కు నగ్నంగానే నడుచుకుంటూ వెళ్లింది. పోలీసులు ఆమెకు రక్షణ కల్పించి..కంప్లెయింట్ ను స్వీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె నడిరోడ్డుపై నగ్నంగా నడుచుకుంటూ స్టేషన్ కు వెళ్తున్న సమయంలో కొందరు ఫోటోలు తీశారు. అయితే రోడ్డు వెంట ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను పోలీసులు తొలగించారు. ఫోటోలు తీసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.