తల్లి పెట్టిన అన్నం..బిడ్డ ప్రాణం తీసింది !

అల్లారుముద్దుగా పెంచుకున్న ఓ చిన్నారి తల్లిదండ్రులను విడిచి తీరని లోకాలకు చేరుకుంది. ఆమె మరణానికి తల్లి పెట్టిన అన్నమే కారణం.

  • Published By: madhu ,Published On : March 30, 2019 / 03:22 AM IST
తల్లి పెట్టిన అన్నం..బిడ్డ ప్రాణం తీసింది !

అల్లారుముద్దుగా పెంచుకున్న ఓ చిన్నారి తల్లిదండ్రులను విడిచి తీరని లోకాలకు చేరుకుంది. ఆమె మరణానికి తల్లి పెట్టిన అన్నమే కారణం.

అల్లారుముద్దుగా పెంచుకున్న ఓ చిన్నారి తల్లిదండ్రులను విడిచి తీరని లోకాలకు చేరుకుంది. ఆమె మరణానికి తల్లి పెట్టిన అన్నమే కారణం. ఏదో ఇరుక్కుని చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం పరిపాటై అయిపోయ్యింది. అన్నం ముద్ద ఇరుక్కుని ఓ చిన్నారి చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. హృదయాన్ని కదిలించే ఈ ఘటన నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం కట్టవారి గూడెంలో చోటు చేసుకుంది.
Read Also : గుడ్ న్యూస్ : పెద్దమ్మగుడి వద్ద మెట్రో ఆగుతుంది

ఈ గ్రామానికి చెందిన కట్ట యుమున (6) అనే బాలిక స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఎప్పటిలానే మార్చి 28 గురువారం రాత్రి చిన్నారికి తల్లి సాలమ్మ అన్నం తినిపిస్తోంది. అయితే..ముద్ద యుమున గొంతులో ఇరుక్కపోయింది. దీనితో శ్వాస తీసుకోవడానికి చిన్నారి తీవ్ర ఇబ్బంది పడిపోయింది. కళ్లెదుటే కూతురు యుమన చనిపోవడంతో సాలమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

కారం అన్నం ముద్ద తినిపించడం..గొంతు నుండి ముద్ద కిందకు జారకపోవడంతో శ్వాస ఆడక చిన్నారి చనిపోయినట్లు భావిస్తున్నారు. మండల విద్యాధికారి నోముల యాదగిరి, సర్పంచ్ కట్ట చక్రవర్తి..ఇతరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. గొంతులో ఆహారం..ఏదైనా వస్తువు ఇరుక్కపోయినట్లు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Read Also : హిజ్రాలే టార్గెట్: మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌