పోలీసుల అదుపులో కరోనా పేషెంట్ కు చికిత్స చేసిన ఆర్ఎంపీ డాక్టర్ 

  • Published By: srihari ,Published On : May 21, 2020 / 12:18 PM IST
పోలీసుల అదుపులో కరోనా పేషెంట్ కు చికిత్స చేసిన ఆర్ఎంపీ డాక్టర్ 

కరోనా పేషెంట్ కు చికిత్స చేసి పరారీలో ఉన్న ఆర్ ఎంపీ డాక్టర్ ను చందా నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెడికల్ టెస్టుల కోసం అతన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి పంపించారు. ఆర్ ఎంపీ డాక్టర్ శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డి కాలనీలో భవానీ క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఇటీవల అతను కరోనా పేషెంట్ కు చికిత్స చేశారు. 

విషయం పోలీసులకు తెలియడంతో ఆర్ ఎంపీ డాక్టర్ పరారయ్యాడు. ఎట్టకేలకు ఆచూకీ తెలియడంతో చందానగర్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆర్ ఎంపీ డాక్టర్ ను మెడికల్ టెస్టుల కోసం నేచర్ క్యూర్ ఆస్పత్రికి తరలించారు. ఆర్ ఎంపీ డాక్టర్ నిర్వహిస్తున్న భవానీ క్లినిక్ తోపాటు సాయిపూజ డయాగ్నస్టిక్ సెంటర్ ను జీహెచ్ ఎంసీ అధికారులు సీజ్ చేశారు. పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన రోగికి ఆర్ ఎంపీ డాక్టర్ చికిత్స చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అలాగే స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో ఆర్ ఎంపీ డాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతను నిర్వహిస్తున్న క్లినిక్ తోపాటుగా మెడికల్ షాపును అలాగే డయాగ్నస్టిక్ సెంటర్ ను జీహెచ్ ఎంసీ అధికారులు సీజ్ చేశారు.