అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి
అనంతపురం : అనంతపురం జిల్లా గుత్తి జాతీయ రహదారి వద్ద మంగళవారం తెల్లవారు ఝూమున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడి కక్కడే మరణించగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గుత్తి సమీపంలోని పెద్ద వడుగూరు మండలం టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని, అంబులెన్స్ ఢీ కొట్టటంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన వారిని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరణించిన వారు గుంటూరు జిల్లా నరసరావు పేటకు చెందిన రైతులుగా తెలుస్తోంది. ఘటనా స్ధలానికిచేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం అందాల్సి ఉంది.