Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి ..

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనంను కారు ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఓ శుభకార్యంలో వంట పనులు పూర్తిచేసుకొని కారులో స్వగ్రామానికి తిరిగి వెళ్తున్నారు. తుమ్మనూరు గేటు వద్ద డీసీఎం వాహనంను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి ..

Road Accident

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనంను కారు ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గురువారం అర్థరాత్రి సమయంలో మహేశ్వరం సమీపంలోని తుమ్మనూరు గేటు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లికి చెందిన కేశవులు (35), యాదయ్య (34), శ్రీను (30), లింగారెడ్డిపల్లి గ్రామానికిచెందిన రామస్వామి (32) గా గుర్తించారు.

Road Accidents 7 Women Died : ఏపీలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మహిళలు మృతి

పోతేపల్లి, లింగారెడ్డిపల్లిలో విషాదం ఛాయలు అలముకున్నాయి. వీరంతా హైదరాబాద్‌లో ఓ శుభకార్యంలో వంటచేసి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. మరికొద్ది గంటల్లో ఇంటికి చేరుకోవాల్సి ఉండగా.. తుమ్మనూరు గేటు వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎంను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. అయితే, కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Road Accident 5 Died : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

రంగారెడ్డి జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండురోజుల క్రితం మాడ్గుల మండలంలోని ఓ ఆటోను పత్తి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.