నల్లొండ జిల్లాలో రోడ్డు యాక్సిడెంట్ : ఏడుగురు మృతి

  • Published By: veegamteam ,Published On : March 6, 2019 / 08:39 AM IST
నల్లొండ జిల్లాలో రోడ్డు యాక్సిడెంట్ : ఏడుగురు మృతి

నల్గొండ జిల్లాలో సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏస్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హైదరాబాద్, దేవరకొండ ఆస్పత్రులకు తరలించారు. చింతపల్లి మండలం శేరిపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సు దేవరకొండ నుంచి హైదరాబాద్ వస్తోంది. ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా గాయపడ్డారు.

హైదరాబాద్-నాగార్జున సాగర్ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏస్ వాహనంలో 10మంది వరకు ఉన్నారు. స్పాట్‌లోనే ఏడుగురు చనిపోయారు. ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 10మందికి గాయాలయ్యాయి. టైరు పేలడంతో అదుపు తప్పిన టాటా ఏస్ వాహనం.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సుని ఢీకొట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

టాటా ఏస్ వాహనం చింతపల్లి గ్రామానికి చెందినదిగా గుర్తించారు. అందులో చింతపల్లి వాళ్లే ఉన్నారా లేక ఇతర గ్రామాల వాళ్లు ఉన్నారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. చింతపల్లి రూట్ లో ఎక్కువగా ప్రైవేట్ వాహనాలే తిరుగుతుంటాయి. స్థానికులు ఎక్కువగా ప్రైవేట్ వాహనాలనే ఆశ్రయిస్తారు.