రూ.20 లక్షల విలువైన వెండి పట్టివేత

హైదరాబాద్ లో భారీగా వెండి పట్టుబడింది. రూ.20 లక్షల విలువ వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Published By: veegamteam ,Published On : September 9, 2019 / 04:13 PM IST
రూ.20 లక్షల విలువైన వెండి పట్టివేత

హైదరాబాద్ లో భారీగా వెండి పట్టుబడింది. రూ.20 లక్షల విలువ వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రాష్ట్రంలో పోలీసుల తనిఖీల్లో భారీగా, వెండి పట్టుబడుతోంది. లక్షలు, కోట్ల విలువైన బంగారం, వెండిని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో భారీగా వెండి పట్టుబడింది. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌లో సోమవారం (సెప్టెంబర్ 9, 2019) పోలీసులు తనిఖీలో నిర్వహించారు. 15 కేజీల బిల్లుతో, 28 కేజీల వెండిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 

వెండి ఆభరణాల విలువ రూ.20 లక్షలు ఉంటుందని తెలిపారు. ఆభరణాలు తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఐటీ అధికారులకు అప్పగించారు.