Robbery : పట్టపగలే ఘరానా లూటీ.. కారు అద్దాలు పగులగొట్టి రూ.25 లక్షలు చోరీ

హన్మకొండ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. కారు అద్దాలు పగులగొట్టి రూ.25 లక్షలు చోరీ చేశారు. నక్కలగుట్ట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు దగ్గర సోమవారం మధ్యాహ్నం ఈ ఘరానా లూటీ జరిగింది.

Robbery : పట్టపగలే ఘరానా లూటీ.. కారు అద్దాలు పగులగొట్టి రూ.25 లక్షలు చోరీ

Robbery

Robbery : హన్మకొండ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. కారు అద్దాలు పగులగొట్టి రూ.25 లక్షలు చోరీ చేశారు. నక్కలగుట్ట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు దగ్గర సోమవారం మధ్యాహ్నం ఈ ఘరానా లూటీ జరిగింది. పట్టపగలే సినీఫక్కీలో కారు అద్దాలు పగులకొట్టి రూ.25 లక్షల నగదు ఎత్తుకెళ్లిపోవడం కలకలం రేపింది. జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి తిరుపతి, ఆయన కుమారుడు సాయి గణేష్… బ్యాంకులో డబ్బులు డ్రా చేసి కారులో పెట్టారు. డ్రా చేసిన తర్వాత సంతకం కోసం మళ్లీ బ్యాంకుకు వెళ్లి తిరిగి వచ్చేలోపే… డబ్బులు ఎత్తుకెళ్లారని బాధితులు వాపోయారు.

Copper : రాగిపాత్రలో నీళ్ళు తాగితే రోగాలు మాయం?

బయటకు వచ్చి చూసేసరికి కారు అద్దాలు ధ్వంసమై కనిపించడంతో అనుమానం వచ్చిందని… దీంతో కారు లోపల చూడగా డబ్బులు పోయినట్లు గుర్తించామని బాధితులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఘటనా స్థలాన్ని డీసీపీ పరిశీలించారు. నగదు దోచుకెళ్తున్న దృశ్యాలు పక్కనే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. పట్టపగలు సినీఫక్కీలో కారు అద్దాలు ధ్వంసం చేసి రూ.25లక్షలు చోరీ చేయడం స్థానికంగా సంచలనంగా మారింది.