హవాలా డబ్బు పట్టివేత : రూ.48 లక్షలు స్వాధీనం

బంజారా హిల్స్ రోడ్ నెం.10లో రూ.48 లక్షలను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Published By: veegamteam ,Published On : March 26, 2019 / 02:50 PM IST
హవాలా డబ్బు పట్టివేత : రూ.48 లక్షలు స్వాధీనం

బంజారా హిల్స్ రోడ్ నెం.10లో రూ.48 లక్షలను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. పలు చోట్ల భారీగా నగదు, మద్యం పట్టుడుతోంది. అక్రమంగా తరలిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. హైదరాబాద్ లో భారీగా హవాలా డబ్బు పట్టబడింది. బంజారా హిల్స్ రోడ్ నెం.10లో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.48 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. విపుల్ కుమార్, ఉపేంద్రకుమార్, పటేల్ చేతన్ కుమార్ అను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.