లోయలో పడిన స్కూల్ బస్సు: ఏడుగురు మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : January 5, 2019 / 10:07 AM IST
లోయలో పడిన స్కూల్ బస్సు: ఏడుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్ లో ఘోరం జరిగింది. రేనుకాలోని డీఏవీ స్కూల్ విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో  ఏడుగురు చనిపోగా 12మంది గాయపడ్డారు. చనిపోయినవారిలో ఆరుగురు స్కూల్ విద్యార్థులు, బస్సు డ్రైవర్ ఉన్నారు.

శనివారం(జనవరి5,2019) ఉదయం 8గంటల సమయంలో సిర్మౌర్ జిల్లాలోని సంఘర్ టౌన్ దగ్గర ఈ ఘటన జరిగినట్లు సిర్మౌర్ ఎస్పీ రోహిత్ మల్ పానీ తెలిపారు.  సమీర్(5), ఆదర్శ్(7), కార్తీక్(14), డ్రైవర్ రామ్ స్వరూప్(40)లు స్పాట్ లో చనిపోగా అభిషేక్, సంజనా,నైతిక్ చౌహాన్ లు తీవ్ర గాయాలతో నహన్ మెడికల్ కాలేజీలో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయినట్లు ఎస్పీ తెలిపారు. గాయపడిన 12 మందిలో వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.  ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.