Ganja Smuggling And Cultivation : గంజాయి మాఫియా ఆటకట్టించేందుకు ఆపరేషన్ డాన్

ఏపీ లో గంజాయి సాగు, రవాణా నివారించేందుకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో సిధ్దమయ్యింది.

Ganja Smuggling And Cultivation : గంజాయి మాఫియా ఆటకట్టించేందుకు ఆపరేషన్ డాన్

Operation Don

Ganja Smuggling And Cultivation  :  ఏపీ లో గంజాయి సాగు, రవాణా నివారించేందుకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో సిధ్దమయ్యింది. ఎప్పుడు లేని విధంగా గంజాయి సాగు పై ఏపీ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.  గంజాయి స్మగ్లింగ్‌ మాఫియా అటకట్టించేందుకు…అపరేషన్ డాన్‌ పేరుతో కేరళ, మహారాష్ట్ర చెందిన గంజాయి మాఫియా పని పట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి.. వారిని  అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఏపీలో గంజాయి సాగును ద్వంసం చేయడంతో పాటు గంజాయి మాఫీయాను అణిచివేసేందుకు ఎస్.ఈ.బీ అపరేషన్ డాన్ పేరుతో కార్యాచరణ రూపోందించింది.

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల(ఏవోబీ)ను అడ్డాగా చేసుకుని దేశవ్యాప్తంగా గంజాయి దందా సాగిస్తున్న కేరళ, మహారాష్ట్ర ముఠా నేతలే లక్ష్యంగా భారీ ఆపరేషన్‌కు ఎస్.ఈ.బీ. అధికారులు ప్రణాళికలు సిధ్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో గంజాయి రవాణా చేసే మధ్యవర్తులు, చిన్న నేరస్తులను పట్టుకుని హడావుడి చేసిన పోలీసులు.. ఆతర్వాత మౌనంగా ఉండిపోవడం చేసేవారు. తరువాత మళ్ళీ గంజాయి మాఫియా వేరే వ్యక్తుల ద్వారా గంజాయి సరఫరా యాధావిధిగా సాగించేవారు.

దీంతో గంజాయి మాఫియాకు హద్దు, అదుపు  లేకుండా పోయి… మూడు పువ్వులు, ఆరుకాయలుగా వ్యాపారం చేస్తూ  కోట్ల రూపాయలు అక్రమంగా సొమ్ము చేసుకునేవారు.  అయితే ఇందుకు భిన్నంగా ఏపీ పోలీసులు యాక్షన్  ప్లాన్ సిద్దం చేస్తున్నారు. గంజాయి స్మగ్లింగ్‌ ముఠాలను నడిపించే బాస్‌లకు చెక్‌ పెట్టేందుకు రంగం సిద్ధమైంది.

Also Read : Students attack with Covid : కరీంనగర్ జిల్లాలో 8 మంది విద్యార్ధులకు కోవిడ్

గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగును రూపుమాపేందుకు ఇప్పటికే స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) ‘ఆపరేషన్‌ పరివర్తన్‌’ చేపట్టింది. గంజాయి సాగుకు వ్యతిరేకంగా గిరిజనుల్లో    చైతన్యం తీసుకురావడం, గంజాయి పంటను ధ్వంసం చేసే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. దీనికి కీలక కొనసాగింపుగా గంజాయి స్మగ్లింగ్‌ వెనుక ఉండే అసలు సూత్రధారులకు చెక్‌ పెట్టేందుకు పోలీస్‌ శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు.

ఏవోబీలో గంజాయి సాగు, స్మగ్లింగ్‌ పూర్తిగా   రాష్ట్రేతర ముఠాల కనుసన్నల్లోనే  జరుగుతోందని  పోలీసుల విచారణలో వెల్లడైయింది. ఈ దందా నిర్వహిస్తున్న సూత్రధారులంతా కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ మాఫియానే   విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో మారుపేర్లతో ఇళ్లు అద్దెకు తీసుకుంటున్నట్లు ఎస్.ఈ.బీ పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఏజంట్ల ద్వారా మన్యంలో గంజాయి సాగుకు నిధులు సమకూరుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Also Read : Daughter Killed Father : అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని తండ్రిని చంపిన కూతురు

అయితే గంజాయి పంట పండిన తరువాత వేలంలో   కొనుగోలు చేసి పోలీసుల   కళ్లు గప్పి కేరళ, మహారాష్ట్ర, హైదరాబాద్‌లకు తరలిస్తున్నారు. కేరళ ముఠాలు ఏకంగా   ప్రత్యేక నైపుణ్యం గల వారిని ఏవోబీలోకి పంపించి గంజాయి ఆకుల నుంచి లిక్విడ్‌ గంజాని తయారు చేస్తూ అక్రమ రవాణా చేస్తున్నాయి. ఈ నెట్‌వర్క్‌ దేశవ్యాప్తంగా చేస్తున్నట్లు గుర్తించిన ఎస్.ఈ.బీ పోలీసులు ఆ కోణంలో అపరేషన్ డాన్ మొదలు పెట్టారు.

ఏపీలో గంజాయి సాగును నిర్దేశిస్తూ, స్మగ్లింగ్‌ చేస్తున్న ముఠా నాయకుల్లో కొందరిని పోలీస్‌ శాఖ ఇప్పటికే గుర్తించింది. కేరళ, మహారాష్ట్రలకు చెందిన డాన్‌ల పేర్లు, చిరునామాలు, ఏపీలో వారి మారు పేర్లు, ఇతర వివరాలతో జాబితాలు రూపొందించినట్టు సమాచారం. ఇప్పటికే ఐజీ, ఎస్పీ స్థాయి అధికారులతో యాక్షన్‌ ప్లాన్‌ను పోలీసులు రూపొందిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నేషనల్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో‌తోనూ రాష్ట్ర పోలీసులు సమన్వయం చేసుకుంటూ ఆపరేషన్ రూపొందిస్తున్నారు.

ఇప్పటికే   ఏవోబీలో చేపడుతున్న ఆపరేషన్‌ పరివర్తన్‌ను ఎన్‌సీబీ కి చెందిన కొందరు అధికారుల బృందం పర్యవేక్షిస్తోంది.   ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసే విషయంలో సహకరిస్తోంది. గంజాయి డాన్‌లను లక్ష్యంగా చేసుకుని ఏపీ పోలీసులు ఆపరేషన్‌కు సిద్ధపడటం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. త్వరలోనే సత్ఫలితాలు సాధిస్తామని పోలీస్‌ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.