Ganja Seized : హైదరాబాద్లో గంజాయి స్వాధీనం-ఇద్దరు అరెస్ట్
తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు రవాణా,వినియోగం పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా పహడీ షరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్దనుంచి 1.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Ganja Seized : తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు రవాణా,వినియోగం పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా పహడీ షరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్దనుంచి 1.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పహాడీషరీఫ్, రాజీవ్ గాంధీనగర్లోని ఒక ఇంట్లో ఇద్దరు వ్యక్తులు గంజాయిని చిన్న, చిన్న కవర్లలో నింపుతుండగా SI నయీముద్దీన్ తన సిబ్బందితో కలిసి ఆ ఇంటిపై దాడి చేసి వారిని అరెస్ట్ చేశారు. నిందితులిద్దరూ మహారాష్ట్ర, నాందేడ్ నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి తీసుకువచ్చి, హైదరాబాద్ లో వాటిని చిన్నచిన్న కవర్లలో నింపి ఎక్కువ ధరకు అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు.
వారి వద్ద ఉన్న 1.7 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు పంపారు. నిందితుల్లో ఒకడైన మహమ్మద్ ఆరిఫ్కు గతంలో నేర చరిత్ర ఉంది. ఇతను హైదరాబాద్ సిటీలోని బహదూర్పూర, కంచన్బాగ్, మాదన్నపేట్, రైన్బజార్, అఫ్జల్గంజ్, హుస్సైనీయాలమ్, శాయినాజ్ గంజ్ పోలీసు స్టేషన్ లలో ఉన్న దొంగతనాల కేసులలో జైలుకు వెళ్ళి వచ్చాడు. రైన్ బజార్ పోలీసు స్టేషన్ నుండి 2017 సంవత్సరంలో PD Act లో జైలుకు వెళ్ళి వచ్చాడని పోలీసులు తెలిపారు.
Also Read : Odisha : పగ బట్టిన ఏనుగు-వృధ్దురాలిని చంపి…చితిపై నుంచి లాగి..