139 మంది రేప్ కేసు విచారణలో సంచలన విషయాలు, వెలుగులోకి డాలర్ భాయ్ బెదిరింపులు

  • Published By: naveen ,Published On : August 28, 2020 / 01:34 PM IST
139 మంది రేప్ కేసు విచారణలో సంచలన విషయాలు, వెలుగులోకి డాలర్ భాయ్ బెదిరింపులు

139 persons rape case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన 139 మంది రేప్ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారు అంటూ సోమాజీగూడకు చెందిన ఓ యువతి చేసిన ఫిర్యాదుపై సీసీఎస్ పోలీసులు దర్యాఫ్తు వేగవంతం చేశారు. ఈ కేసు విచారణలో తవ్వుతున్న కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కేసు దర్యాఫ్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.



ఎవరీ డాలర్ భాయ్:
విచారణలో భాగంగా డాలర్ భాయ్ అనే వ్యక్తి పేరు బయటకు వచ్చింది. డాలర్ భాయ్ బెదిరింపులు బయటపడ్డాయి. పలువురికి ఫోన్ చేసిన డాలర్ భాయ్ వారిని బెదిరించాడు. దీనికి సంబంధించిన ఆడియోలు టెన్ టీవీ చేతికి చిక్కాయి. డాలర్ భాయ్ గ్యాంగ్ గురించి తెలుసుకునేందుకు రెండు నెలల క్రితమే రంగంలోకి ప్రైవేట్ డిటెక్టివ్ లు దిగినట్టు పోలీసులు గుర్తించారు.

డాలర్ భాయ్ అరాచకాలపై ఇప్పటికే పలు జిల్లాల్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో 139 మంది పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే బాధితురాలు వెల్లడించిన ప్రముఖుల పాత్రపైనా ఎంక్వైరీ జరుపుతున్నారు. కేసుని ఏమైనా తప్పుదోవ పట్టిస్తున్నారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.



9ఏళ్లుగా 5వేల సార్లు అత్యాచారం జరిగిందని ఆరోపణ:
139మంది తనపై అత్యాచారం చేసినట్లు పాతికేళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలైన దళిత యువతి గత తొమ్మిది సంవత్సరాలుగా తనపై 5 వేల సార్లు అత్యాచారం జరిగిందని ఆరోపించింది. ఇందుకు 139 మంది కారణమని సంచలన ఫిర్యాదు చేసింది. ఆ 139 మంది పేర్లను కూడా పోలీసులకు ఇచ్చింది బాధితురాలు.

నాకు ఎలాంటి సంబంధం లేదు-యాంకర్ ప్రదీప్
బాధితురాలి ఫిర్యాదుతో 139 మంది పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్‌లో చేర్చిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రముఖుల పేర్లు సైతం ఉండడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. చివరికి యాంకర్ ప్రదీప్ పేరు కూడా ఉండడంపై గురువారం(ఆగస్టు 27,2020) ఆయన స్వయంగా ఓ వీడియో విడుదల చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను ప్రదీప్ తీవ్రంగా ఖండించారు. ఈ కేసుతో తనకేం సంబంధం లేదని స్పష్టం చేశారు. సున్నితమైన ఇలాంటి అంశంలో తన పేరు ఎందుకుందో కూడా ఆలోచించకుండా ఇష్టమొచ్చినట్టు రాసేస్తున్నారని మండిపడ్డారు. అవతలి వ్యక్తులు ఏ ఉద్దేశంతో ఈ ఆరోపణలు చేస్తున్నారో.. ఎవరు చేయిస్తున్నారో ఆలోచించకుండా వ్యక్తిగతంగా లక్ష్యంగా చేయడం ఎంతగానో బాధ కలిగిస్తోందని ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశారు.



తొమ్మిదేళ్లుగా ఎందుకు మౌనంగా ఉంది?
ఈ సంచలన కేసు వ్యవహారంలో కొన్ని ప్రశ్నలు పోలీసులను వేధిస్తున్నాయి. గత తొమ్మిదేళ్లుగా ఇంతలా ఘోరం జరుగుతుంటే ఆ విషయం ఇన్నాళ్లూ ఎందుకు వెలుగులోకి తీసుకురాలేదని పోలీసులు ప్రధానంగా అనుమానిస్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసిన తర్వాత దీని విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాక, సీసీఎస్‌కు పోలీసులకు ఈ కేసును బదిలీ చేశారు.

బాధితురాలి పేరుతో డాలర్ భాయ్ బ్లాక్ మెయిల్:
9 సంవత్సరాలుగా రేప్ జరుగుతూ ఉంటే ఈ విషయం ఎందుకు బయటకు రాలేదనే ప్రశ్న ప్రధానంగా పోలీసులను వెంటాడుతోంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో కీలక పాత్రగా వ్యవహరించిన వ్యక్తి డాలర్ బాయ్ అలియాస్ కేఎస్‌ఆర్. ఇతని కోసం పోలీసులు తీవ్రంగా వెతుకుతున్నారు. బాధిత యువతిని కాపాడుతున్నట్లుగా నటిస్తూ ఆమెను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఇతనిపై ఉన్నాయి. బాధితురాలి పేరుతో డాలర్ బాయ్ బ్లాక్ మెయిల్‌కి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వ‌స్తున్నాయి.



దీంతో ఈ కేసులో డాల‌ర్ బాయ్ కీల‌కంగా మారాడు. డాల‌ర్ బాయ్ వ్య‌వ‌హారంపై సీసీఎస్ పోలీసులు నిఘా పెట్టారు. ఇప్పటికే భాదితురాలు స్టేట్ మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేశారు. తమ ప్రమేయం లేకపోయినా ఉద్దేశ పూర్వకంగా ఇరికించారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
https://10tv.in/kashmiri-man-nabbed-by-crpf-near-parliament-building/
దేశ చరిత్రలోనే తొలిసారిగా 139మందిపై నిర్భయ కేసు:
ఆగస్టు 21వ తేదీన 139 మంది అత్యాచారం చేశారంటూ మిర్యాలగూడకు చెందిన 25 ఏళ్ల యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మొత్తం 139 మందిపై పంజాగుట్ట పోలీసులు నిర్భయ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే ఓ మహిళ ఇంత మందిపై ఫిర్యాదు చేయడం, 139 మందిపై నిర్భయ కేసు నమోదు కావడం దేశ చరిత్రలోనే ఇదే మొదటి సారి కావడం విశేషం. కాగా, 139 మందిపై ఆరోపణల్లో ఎవరు నిందితులు, ఎవరు భాదితులు అనే కోణంలో సీసీఎస్ పోలీసులు విచారణ చేస్తున్నారు.