కూతుళ్లను లైంగికంగా వేధిస్తున్న భర్తను అంతమొందించిన భార్య

  • Published By: nagamani ,Published On : September 9, 2020 / 12:22 PM IST
కూతుళ్లను లైంగికంగా వేధిస్తున్న భర్తను అంతమొందించిన భార్య

మద్యానికి బానిసైన భర్తతో జీవితం నరకంగా మారింది. తాగి వచ్చి ప్రతీరోజు తనకు ఇద్దరు కూతుళ్లపై అత్యాాచారానికి యత్నించే భర్తను ఆ భార్య సహించలేకపోయింది. సహనం కోల్పోయింది. ఓ రోజు తనను చంపటానికి వచ్చిన భర్తపై సుత్తితో దాడి చేసి చంపేసింది.

ముంబైలోని భారత్ నగర్ లోని శాంతి స్మృతి భవనంలోని ఫస్ట్ ఫోర్ల్ లో తన ఇద్దరు కూతుళ్లతో నివసించే మహిళ వైశాలి భకారే. ఆమె భర్త అశోక్ భకరే దాదార్ లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి మద్యం తాగందే ఉండలే. మద్యం తాగాక భార్య కొట్టి.. ఇద్దరు కూతుళ్లపై అత్యాచారానికి యత్నించేవాడు. దీంతో ఇక్కడే ఉంటే భర్త అఘాయిత్యానికి తన కూతుళ్లు బలైపోతారని భయపడిని వైశాలి తన కూతుళ్లను తన తల్లిదగ్గరకు పంపేసింది. ఇక నీతో కలిసి ఉండలేనంటూ అదే భవనంలో వేరే పోర్షన్ లోకి మారిపోయింది.



https://10tv.in/woman-buries-husband-under-bedroom-after-killing-him-in-tripura/
ఈ క్రమంలో అశోక్ తాగి ఇంటికి వచ్చినప్పుడు భార్యతో గొడవమాత్రం మానేవాడు కాదు..కొట్టటానికి యత్నించినప్పుడల్లా భార్య వైశాలి భర్తను బైటకు గెంటేసి తలుపులు వేసేసేది. దీంతో భార్యపై ఆగ్రహం పెరిగిపోయేది అశోక్ కు.నీ కూతుళ్లకు ఎక్కడకు పంపావే..వాళ్లని వదిలిపెట్టనంటూ అరిచేవాడు. అలా సోమవారం (సెప్టెంబర్ 7,2020) తెల్లవారుఝామున 1.30 సమయంలో ప్రతీరోజులాగానే ఫుల్ గా తాగి ఇంటికొచ్చాడు అశోక్. ఆ సమయానాకి వైశాలి తలుపు బోల్ట్ వేయటం మరిచిపోయి దగ్గరకు వేసి నిద్రపోయింది.


ఈ క్రమంలో తాగి వచ్చిన అశోక్ భార్య ఉండే పోర్షన్ దగ్గరకెళ్లాడు. తలుపు బలంగా కాలితో తన్నాడు. భార్యపై దాడిచేశాడు. దీంతో వైశాలి భయపడిపోయింది. చంపేశాలా ఉన్నాడని హడలిపోయింది..మద్యం మత్తులో పశువులా మారిపోయిన భర్తను నిలువరించలేకపోయింది. కనిపించిన ప్రతీ వస్తువుతోను భార్యకు దారుణంగా కొడుతున్నారడు. దీంతో చేతికి అందిన ఓ సుత్తి పట్టుకుని భర్తను కొట్టింది వైశాలి. అలా కోపంతో ఊగిపోతు పదే పదే కొట్టటంతో భర్త అశోక్ చనిపోయాడు.


నీ మద్యం మత్తు మా జీవితాలను తగులబెట్టేదాకా తీసుకొచ్చావు దుర్మార్గుడా అంటూ అక్కడిక్కడే కుప్పకూలిపోయి గుండెలవిసేలా ఏడ్చింది వైశాలి. కానీ తాను పోలీసుల నుంచి తప్పించుకోవాలని అనుకోలేదామె. ముంబై కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అశోక్ భకరే మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.