శంషాబాద్ @ నేరస్తుల అడ్డా ? 

శంషాబాద్... ఈ పేరు ఇపుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇక్కడే ఇద్దరు మహిళలు మంటలకు బలైపోయిన ఘటనలు చర్చనీయాంశంగా మారాయి.  కామాంధుల పైశాచికత్వానికి ప్రాణాలు కోల్పోయిన ప్రియాంకరెడ్డి ఘటన ఓవైపు కలకలం రేపుతుండగానే.. మరో మహిళ మంటల్లో కాలి బూడిదయ్యింది. దీంతో.. అసలు శంషాబాద్‌లో ఏం జరుగుతోందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

  • Published By: chvmurthy ,Published On : November 30, 2019 / 02:25 AM IST
శంషాబాద్ @ నేరస్తుల అడ్డా ? 

శంషాబాద్… ఈ పేరు ఇపుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇక్కడే ఇద్దరు మహిళలు మంటలకు బలైపోయిన ఘటనలు చర్చనీయాంశంగా మారాయి.  కామాంధుల పైశాచికత్వానికి ప్రాణాలు కోల్పోయిన ప్రియాంకరెడ్డి ఘటన ఓవైపు కలకలం రేపుతుండగానే.. మరో మహిళ మంటల్లో కాలి బూడిదయ్యింది. దీంతో.. అసలు శంషాబాద్‌లో ఏం జరుగుతోందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

శంషాబాద్… ఈ పేరు ఇపుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇక్కడే ఇద్దరు మహిళలు మంటలకు బలైపోయిన ఘటనలు చర్చనీయాంశంగా మారాయి.  కామాంధుల పైశాచికత్వానికి ప్రాణాలు కోల్పోయిన ప్రియాంకరెడ్డి ఘటన ఓవైపు కలకలం రేపుతుండగానే.. మరో మహిళ మంటల్లో కాలి బూడిదయ్యింది. దీంతో.. అసలు శంషాబాద్‌లో ఏం జరుగుతోందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

శంషాబాద్‌… ఇంతకాలం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌తో పేరుపొందిన పట్టణం. కానీ… ఇపుడు మహిళల వరుస మరణాలతో ఆ పేరు మసకబారింది. ముఖ్యంగా ఈ ప్రాంతం నేరాలకు అడ్డాగా మారడం స్థానికులను కలవర పెడుతోంది. మొన్న(28-11-19) ప్రియాంకరెడ్డి, నిన్న(29-11-2019) గుర్తుతెలియని మహిళ.. ఇద్దరూ మంటల్లో కాలి బూడిదయ్యారు. వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయింది శంషాబాద్ సమీప ప్రాంతంలోనే. ప్రియాంకరెడ్డిపై అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు కామాంధులు… ఆమె మృతదేహాన్ని చటాన్‌పల్లి వద్దకు తీసుకొచ్చి కాల్చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. శంషాబాద్‌ ప్రాంతంలో మహిళల భద్రతపై ప్రశ్నలు రేకెత్తించేలా చేసింది. ఓవైపు ఈ దారుణ ఘటన ప్రకంపనలు కొనసాగుతుండగానే.. మరో ఘోరం వెలుగు చూసింది.

శంషాబాద్ సమీపంలోని సిద్ధులగుట్ట ప్రాంతంలోనూ ప్రియాంకలాంటి ఘటనే జరిగింది. ఇక్కడ కూడా ఒక మహిళ మంటల్లో కాలిపోయి కనిపించింది. అయితే… ప్రియాంకరెడ్డి హత్యకు కామాంధులే కారణమని తేలగా… ఈ మహిళ మృతిపై మాత్రం ఏం జరిగిందన్నది మిస్టరీగా మారింది. ఈమెను ఎవరైనా హత్య చేశారా? లేక ఆమే ఆత్మహత్య చేసుకుందా? అన్నది తేలాల్సి ఉంది. దీనిపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు మిస్టరీ ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. 48 గంటల వ్యవధిలోనే ఈ ఘటనలు జరగడం… ఇద్దరూ మంటల్లో కాలిపోవడం కలకలం రేపుతోంది. నేరస్తులకు శంషాబాద్ ప్రాంతం అడ్డాగా మారిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లను వదిలి రోడ్డెక్కాలంటేనే వణికిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నారు.