Sexually Assualting : కీచకుడు…ఐదుగురు బాలికలపై అత్యాచారం చేసి 50 వీడియోలు….

తీగలాగితే డొంక కదిలిందన్నట్లు ... నిషేధిత పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నాడనే అనుమానంతో ఒక దుకాణం యజమానిని అదుపులోకి తీసుకోగా అతను బాలికలపై చేస్తున్న అత్యాచారం బయటపడింది.

Sexually Assualting : కీచకుడు…ఐదుగురు బాలికలపై అత్యాచారం చేసి 50 వీడియోలు….

Girls Raped

Sexually Assaulting : తీగలాగితే డొంక కదిలిందన్నట్లు … నిషేధిత పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నాడనే అనుమానంతో ఒక దుకాణం యజమానిని అదుపులోకి తీసుకోగా అతను బాలికలపై చేస్తున్న అత్యాచారం బయటపడింది.

చెన్నైలోని టీపీ చత్రం పోలీసు స్టేషన్ పరిధిలో పెరుమాళ్ (40) ఒక దుకాణం నడుపుతున్నాడు. నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్నాడనే సమాచారంతో పోలీసులు అతడి దుకాణంపై దాడి చేశారు. అతడ్ని అరెస్ట్ చేసి,  విచారణలో భాగంగా అతని ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. పొగాకు ఉత్పత్తులు ఎవరెవరు సరఫరా చేస్తారనే సమాచారం తెలుసుకోటానికి ఫోన్ పరిశీలించగా దారుణాలు  వెలుగు చూశాయి.

ఐదుగురు బాలికలపై అఘాయిత్యానికి   పాల్పడి వాటిని వీడియోలు తీసి తన మిత్రులకు షేర్ చేసిన కీచకుడు అతడు. ఐదుగురు బాలికలతో తీసిన 50 వీడియోలు ఆ ఫోన్ లో ఉండటంతో పోలీసులు షాక్‌కు   గురయ్యారు. అతడిని వెంటనే అరెస్ట్ చేసి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు  తరలించారు.

తన దుకాణంలో అడుకోడానికి వచ్చిన బాలికలతోనూ, దుకాణంలో బాకీ పెట్టిన మహిళల కుమార్తెలపై  పెరుమాళ్ అత్యాచారాలకు పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను వీడియో తీసుకున్నాడు. ఆ రకంగా 50 వీడియోలు ఉన్నాయి. పెరుమాళ్ తమపై పలుమార్లు అత్యాచారానిక ఒడిగట్టినట్టు బాధితులు పేర్కోన్నారు.

పెరుమాళ్ కు ఇద్దరు   అక్కా, చెళ్లెళ్లు సహకరించారు. తమ కూతుళ్లను  కూడా పెరుమాళ్ వద్దకు పంపించడం దిగ్బ్రాంతిని  కలిగించే విషయం. ఆ అక్కచెల్లెళ్లు కూడా పెరుమాళ్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. తాము, తమ కూతుళ్లు పెరుమాళ్‌తో సంబంధం పెట్టుకోవటంతో దుకాణం   నుంచి నిత్యావసరాలను ఉచితంగా తీసుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

వీరి పిల్లలు కాకుండా మరో ముగ్గురు  పిల్లలు దుకాణంలో ఆడుకోటానికి రాగా వారిపై కూడా పెరుమాళ్ అత్యాచారం చేశాడు. పోలీసులు అతడి ఫోన్ చూడకుండా ఉండి ఉంటే ఈ అకృత్యాలు బయటకు వచ్చి ఉండేవి కావు.  బాలికలను   చైల్డ్ హోమ్ కు తరలించి, పెరుమాళ్‌, అతనికి సహకరించిన ఇద్దరు అక్కా చెల్లెళ్లపై  పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు డిప్యూటీ కమీషనర్ కార్తికేయన్ తెలిపారు.